పుట:Aandhrakavula-charitramu.pdf/742

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

715

క వి రా క్ష సు డు

మను సంస్కృత నిఘంటువు నొకదానిని వ్రాసి యున్నాఁడు, ఆంధ్రకవి కంటె నిఁతడు భిన్నుఁడు.

రంగరాట్ఛందములో 'కవిరాక్షసీయము' లోనిదిగాఁ జెప్పఁబడిన పద్యము అనంతుని ఛందము (ఛందోదర్పణము) లో ననంతునిదిగాఁ గాన వచ్చుచున్నది. ఇతని గ్రంథములు లభ్యములు కానందున నెట్లు నిశ్చయించుటకు వలనుకాకున్నది.

వెన్నెలకంటి జన్నయ్య రచనగాఁ బ్రసిద్ధమై 'దేవకీ నందన శతకము' లోని యొక పద్యమునుబట్టి యది 'కవిరక్షః శ్రేష్ఠ ప్రణీత' మనియు పదివేల పద్యములలో నేర్చి నూటపది పద్యములీశతకముగా నర్పించెననియుఁ దెలియు చున్నది. కానీ పద్యము ప్రక్షిప్తమని తలఁపఁబడుచున్నది.]