పుట:Aandhrakavula-charitramu.pdf/740

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

713

క వి భ ల్ల టు డు

[ఈ కవినిగూర్చి 'తెనుఁగుకవుల చరిత్ర' లో నిట్లున్నది. "తెలుగున ప్రాచీన కవుల నామములను పరిశీలించిన నవి కొన్ని ప్రసిద్ద సంస్కృత కవుల నామములని తెలియఁదగి యున్నది. అవి బిరుదములై నను - బిరుదనామముతో వ్యవహార ముండుటవలన నా యా వ్యక్తుల నిజనామములు మఱుగుపడి యున్నవి.... .... వారిలో నీ కవిభల్లటుఁడు నొకఁడు. ఈతఁడు సంస్కృతమున భల్లట శతకమును రచించి కాశ్మీర దేశమున ప్రఖ్యాతికెక్కిన కవిభల్లటుని పేర వెలసినవాఁడు. తెలుగు భల్లటకవి శూద్రకరాజ చరిత్రమును, బేతాళ పంచవింశతిని రచించినట్లు లక్షణ గ్రంధములు చెప్పుచున్నవి. ఈతఁడే రచించిన 'పదమంజరి' యను సంస్కృత గ్రంథమునుబట్టి యీతని కాలము 1060–70 ప్రాంతమని చెప్పవచ్చును.] (పుట. 306.)