పుట:Aandhrakavula-charitramu.pdf/717

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

690

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

యేమియుఁ జెప్పలేదు. వారొక్కరేయైనను, నిర్వురైనను విష్ణుపురాణకర్తయైన సూరనార్యునికి తాత గాని. యాతని తాతగాని పై పద్యములలోని సూర్యులలో నెవఁడును గాఁడు. వీరు వారికంటే భిన్నులు; .... .... ఒకప్పుడీ సూరన యాతని వంశ పరంపరలోనివాఁడు కాక వెన్నెలకంటి వారని గృహనామము గల మఱియొక వంశీయుఁడైనఁగావచ్చును. ......... (పుటలు 216,217) వేమారెడ్డి, అనపోతారెడ్డి ప్రభువుల కాలములో నున్న వెన్నెలకంటి సూర్యునిఁబట్టి కాలనిర్ణయముచేయుచు, గురుజాడ శ్రీరామమూర్తి పంతులుగారు కవికాలము క్రీ. శ. 1378-1428 అనియును, వీరేశలింగము పంతులుగారు 1460-1480 అనియును నిర్ణయించియున్నారు. కాని, ఆ నిర్ణయము సరియైనదికాదు. .... .... (పుట 224). ఈ సూరనార్యుఁడు పదునారవ శతాబ్దియందున్న వాడని స్పష్టము.]

ఈ కవి విష్ణు పురాణమునందు తన్నుఁగూర్చి చెప్పుకొన్న పద్యము నిందుదాహరించుచున్నాను.

        సీ. భవ్యచరిత్రు నాపస్తంభమునిసూత్రు
                          శుద్ధసారస్వతస్తోత్రపాత్రు
            హరిత గోత్రపవిత్రు నాంధ్రభాషాకావ్య
                          రచనాభినయవిశారదుఁ బ్రబంధ
            కర్తను వెన్నెలకంటి సూర్యునిమను
                          మనిఁ జెఱుకూరి యమరయమంత్రి
            సత్పుత్రు నాశువిస్తారవిచిత్రమా
                          ధురకవిత్వచాతుర్యశీలు

            నిజకులాచారమార్గైకనివుణుఁ బరమ
            సాత్వికోదయహృదయ వైష్ణవపురాణ
            వేది సారస్యవిద్యాప్రవీణు సుకవి
            మాననీయుని సూరనామాత్యవరుని.