పుట:Aandhrakavula-charitramu.pdf/716

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

689

వె న్నె ల కం టి సూ ర న్న


దండ్రీకొడుకుల కిద్దఱికిని ప్రబంధము లంకితముచేసి బహుమానములొంది యుండవచ్చును. అంతేకాక యనపోత రెడ్డి దండనాధుఁడుగా నుండి తండ్రి జీవితకాలములోనే ప్రసిద్ది చెందియుండెనని యెఱ్ఱా ప్రెగడ హరివంశము నందు స్పష్టముగాఁ జెప్పఁబడి యున్నది. వేమారెడ్డి హూణశకము 1320-వ సంవత్సరము మొదలుకొని 1349 వ సంవత్సరము వఱకును, అతని పుత్రుఁడైన వేమయయనపోతారెడ్డి 1350 వ సంవత్సరము మొదలుకొని 1361 వ సంవత్సరమువఱకును, రాజ్యము చేసినందున వారి యాస్థానము నందుండిన కవి వెన్నెలకంటి సూరన్న యా కాలమునందే నిస్సంశయముగా నుండినవాడు. ఈ కవి రచియించి యనపోతరెడ్డి కంకితముచేసిన ప్రబంధములేవో తెలిసినవి కావు. మనలో సాధారణముగా తాత పేరు మనుమనికి పెట్టుచుండుట యాచారమయినందున, విష్ణుపురాణమును రచించిన యీ సూరన్న పయి సూరన్నకు మనుమఁడో, మనుమని మనుమఁడో యయి యుండవలెను. ఈ కవి తాను అనపోత రెడ్డికి ప్రబంధము లొసంగిన వెన్నెలకంటివారి వంశజుఁడ ననియు; వెన్నెలకంటి సూర్యుని మనుమఁడ ననియు, వేఱువేఱుగాఁ జెప్పుకొనుటచేత నీతఁడు వేమారెడ్డి కాలములో నున్న సూరన్నకు మనుమని మనుమఁడగుట స్పష్టము. కవి మొదటిసూరన్న కయిదవతరము వాఁడగుటచే నిరువురకును నూఱు సంవత్స రములకంటె నెక్కువ వ్యత్యాసముండి యుండవలెను. కాబట్టి యీ కవి 1460-వ సంవత్సరమునకు 1480 వ సంవత్సరమునకును నడిమికాలములో నుండినట్లు నిశ్చయింపవలసియున్నది.

[ఇయ్యెడ 'ఆంధ్రకవితరంగిణి' లో (సం, 8 పుట 213,214) నిట్లున్నది- 'పంతులుగారు వ్రాసిన యంశము లన్నియు నూహాజనితములేకాని, యొక యాధారముననుసరించి వ్రాసినవికావు, పంతులుగారి యూహ సత్యమైనను కావచ్చును. అట్లుకాక వారిరువురును వేఱువేఱు వ్యక్తులైనను కావచ్చునని, విష్ణు పురాణకర్త అనపోతారెడ్డికి సత్ప్రబంధము లొసంగిన వెన్నెలకంటివారని మాత్రమే చెప్పెను. కౌని వేమారెడ్డియొద్ద నగ్రహారములను గైకొనిన సంగతినిగూర్చి