పుట:Aandhrakavula-charitramu.pdf/711

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

684

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

కృతిపతియింటిపేరేమో యే కాలమునం దుండినవాఁడో యీ గ్రంథమునుబట్టి తెలియరాలేదు; గాని యితర గ్రంథములనుబట్టి తెలియవచ్చుచున్నవి. కృతిపతి యయిన బసవక్షితీశ్వరుఁడు శ్రీరాముని కుమారుఁడగు కుశునివంశమువాఁడగు మాధవవర్మసంతతివాఁడయినట్లు చెప్పి, కవి మాధవవర్మ నిట్లు వర్ణించి యున్నాఁడు

       చ. మును బెజవాడ దుర్గమున ముగ్ధుతనంబున మెచ్చఁజేసెఁ బెం
           పున రథదంతివాజీభటభూరిబలంబులచేఁ గళింగభూ
           జనపతిఁ ద్రుంచి చేవఁ దన సంతతికై మహిఁ బాడి నిల్పి గ్ర
           మ్మనఁ జిరకీర్తులం గనిన మాధవవర్మనిజాన్వయంబునన్.

పూసపాటివారు మొదలైన ప్రాంతములయందలి క్షత్రియసంస్థానాధి పతులందఱును దామీ మాధవవర్మ సంతతివార మనియే చెప్పుకొనుచున్నారు. ఈ మాధవవర్మవంశమునందు కొమ్మావనీశుఁడు పుట్టినట్టును, ఆతని కబ్బలదేవుఁ డుద్భవించినట్టును, అతనికీ సింగభూపాలుఁ డుదయించినట్టును, అతనికి తమ్మరాజు కలిగినట్టును, అతనికిఁ గృతిపతి యైన బసవధరాధినాధుఁడు జనియించినట్టును చెప్పఁబడి

      మ. మనుమార్గుడగు తమ్మభూపతికి దేమాజాంబకుం బుత్రుఁడై
          జనియించెన్ బసవేంద్రుఁ డర్థిజనభాస్వత్కల్ప భూజాతమై
          వనితామన్మథుఁడై వివేకనిధియై వారాశిగాంభీర్యుఁడై
          యనతారాతి మహాంధకారపటలీహంస ప్రతాపాఢ్యుడై

      సీ. రమణీయదానధారాప్రవాహంబులు
                  పాధోది కతివిజృంభణముగాఁగ
          నిరుపమాన ప్రభానిర్మలసీతకీర్తి
                 త్రిభువనసాంద్రచంద్రికలు గాఁగ
          నతులవిక్రమబలోద్యత్ప్రతాపస్పూర్తి
                 పరులకునుగ్రాతపంబుగాఁగ
          సమధికశృంగార సౌందర్యరేఖ దాఁ
                 దరుణీలతావసంతంబుగాఁగ