పుట:Aandhrakavula-charitramu.pdf/698

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

671

నం ది మల్ల య్య, ఘంట సిం గ య్య

              గపటాహితమదాంధకార మదఁగ
      గజపతిసురధాణిగడిదుర్గముల కెల్ల
              నే రాజు వజ్రంపుబోరుతలుపు
      మహిమచే నే రాజు మఱపించె నలభగీ
              రధపృధుమాంధాతృరఘురమణుల

      నట్టి గుణశాలి తమ్మరాయనికుమార
      వీరబసవపక్షమాచక్రవిభునిచేత
      మన్ననలఁ గాంచి మించిన మహితుఁ డితఁడు
      మనుజమాత్రుండె గంగయామాత్యవరుఁడు.

గంగయామాత్యుని ప్రభువయిన బసవనృపాలుఁడు కొండవీటిరాజ్యమును గజపతు లాక్రమించుకొన్న తరువాత వారిగడిదుర్గముల కధ్యక్షుఁడయి పదునైదవ శతాబ్దోత్తరభాగమున నుండిన సామంతరాజు, బసవమహీశుని సచివుఁడై న గంగయామాత్యుఁడు ప్రటోధచంద్రోదయము కృతినందకముందే దగ్గుపల్లి దుగ్గయ్యచేత రచియిఁపఁబడిన నాచికేతూపాఖ్యానమును గృతి నందెను. ప్రబోధచంద్రోదయముయొక్క చతుర్ధాశ్వాసాంతము నందలి కృతిపతిసంబోధనమయిన యీ క్రింది పద్యము వలన నీయంశము తేటపడు చున్నది.


    క. ప్రఖ్యాతనాచికేతూ
       పాఖ్యానమహా ప్రబంధపరిమళితసుధీ
       వ్యాఖ్యానశ్రవణోదిత
       సౌఖ్యా ! సంఘటితచిత్తశంకరసఖ్యా !

1465వ సంవత్సర ప్రాంతమునందు శ్రీనాథుని ముద్దుమఱఁది మైన దుగ్గకవిచేత నాచికేతూపాఖ్యాన మీతని కంకితము చేయఁబడెను. అటు తరువాత 1470-75 సంవత్సరప్రాంతమున నీ జంటకవులు ప్రబోధచంద్రోదయము నీతని కంకిత మొనర్చిరి. [ప్రబోధచంద్రోదయరచనా కాలముం గూర్చి " ఆంధ్రకవి తరంగిణి" (సం, 6 పుట 131) లో నిట్లున్నది.]