పుట:Aandhrakavula-charitramu.pdf/697

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

670

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

“ఇది శ్రీమదుమామహేశ్వర వరప్రసాదలబ్దసారస్వతాభినంది నంది సింగయామాత్యపుత్ర మల్లయమనీషితల్ల జ మలయమారుతాభిధాన ఘంట నాగయప్రధానతనూభవ సింగయకవిపుంగవ ప్రణీతంబయిన" అని వ్రాసికొని యున్నారు. వీరిరువురును షట్సహస్రనియోగి బ్రాహ్మణులు. వీరిలో
మొదటివాఁడయిన నందిమల్ల య్య కౌశికగోత్రుఁడు; అపస్తంభసూత్రుఁడు; దక్షిణామూర్తి గురుశిష్యుఁడు. రెండవవాడయిన ఘంట సింగయ్య భరద్వాజగోత్రుఁడు; ఆపస్తంభసూత్రుఁడు; ఆఘోర శివశిష్యుఁడు. ఈ యంశములనే కవులు తమ వరాహపురాణమునం దిట్లు చెప్పుకొనిరి.

       సీ. అపుడు సభా వేదికాగ్రస్థితులమైన
                         మమ్ము వాగీశ్వరీమంత్ర రాజ
           సిద్దిపారగులఁ గౌశి భరద్వాజగో
                         త్రుల మహాదేవాంఘ్రిజలజభక్తి
           పరతంత్రమతుల నాపస్తంభసూత్రుల
                          గురుదక్షిణామూర్త్య ఘోరశివుల
           శిష్యుల నతిశాంతచిత్తులఁ దనకు నా
                         శ్రితుల భాషాద్వయకృతినిరూఢ

           శేముషీభూషణుల నందిసింగనార్య
           తనయుమల్లయకవికులోత్తముని ఘంట
           నాగధీమణికూర్మినందనుని మలయ
           మారుతాంకితు సింగయమంత్రిఁ జూచి.

ప్రబోధచంద్రోదయకృతిపతి యైన యనంతామాత్యగంగయ్య తమ్మరాజ పుత్త్రుడయిన వీరబసవనృపాలునకు మంత్రియయి మన్ననలఁ బొందినట్లీ క్రింది పద్యమునఁ జెప్పఁబడినది.

      సీ. మాధవవర్మభూమండలేశ్వరవంశ
                       జలధికి నే రాజు చందమామ
          యే రాజుదయశైల మెలమి విభేదించె