పుట:Aandhrakavula-charitramu.pdf/694

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

667

పి ల్ల ల మ ఱ్ఱి పి న వీ ర న్న

          అలరుగందపు మ్రాన నలరు పూచినయట్టు
                          శ్రీమంతునకు గీర్తి చెందెనేని;

          భవ్యగుణసాంద్ర ! సకలవైభవసురేంద్ర
          సహజదానశిబీంద్ర ! భాషాఫణీంద్ర !
          సాళువక్షోణిపతివంశజలధిచంద్ర!
          గుండభూపాలనరసింహమండలేంద్ర !

ఇతనికవిత్వ మనర్గళధారగాఁ బ్రవహించుచు, నాతికఠినమయి రసపుష్టి కలిగి యుండును. కవిత్వశయ్య బోధపడుటకయి కొన్ని పద్యము లిందుదా రింపఁబడుచున్నవి.

1. జైమినిభారతము.

          ఉ. కాఁక నెదిర్చి సంగరముఖంబున హెచ్చిన రాజవంశమున్
              గూఁకటివేళ్ళతోఁ బెఱికి గోత్రవధంబును జేసినట్టి యా
              వ్రేకపుఁగీడు గాక ప్రజ వేఁచఁ దలంచిన గోరుచుట్టుపై
              రోఁకటిపోటుచందముగ రోసి జను ల్ననుఁ జూచి తిట్టరే.

         ఉ. క్రమ్మెడు చిమ్మచీఁకటులు కార్కొన మార్కొనుచోఁ బరస్పరా
             స్యమ్ములు గానరాక విరసమ్ముగఁ గై కొనునట్టి సాంపరా
             యమ్మునఁ జెంగలించి లవుఁ డన్నకుఁ దోడయి దీప్తబాణజా
             లమ్ముల నంధకార పటల మ్మఖిలమ్ము ఖిలము చేయుచున్

         ఉ. పట్టిన కార్య మీశ్వరుఁడు పట్టి పెనంగినఁ జేరనీక చే
             పట్టుట రాజధర్మ మని పల్కెడు నీతిఁ దొఱంగి కీర్తికిం
             బట్టగు సాహసంబు నిజాబాహుబలంబును వీటిఁబుచ్చి యీ
             పట్టిన వాహముం దిరుగఁ బంపిన నవ్వరె తోడిభూపతుల్.

         మ. నను నే మన్నఁ గొఱంత లేదు సభలోనం బుణ్య చరిత్ర మ
             జ్జననిం దప్పఁగ నాడి తీ నికృతిన్ సైరింపఁగా నేర నా
             వినయం బింతకుఁ దెచ్చెఁ జాలుఁ బలుకు ల్వేయేల నే క్షత్రియుం
             డనొ వైశ్యుండనొ చూడుమంచు మగిడెన్ సంగ్రామసంరంభియై