పుట:Aandhrakavula-charitramu.pdf/695

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

668

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

 2. శకుంతలాపరిణయము

        మ. జననం బొందితి దుగ్ధవారినిధి నా సర్వేశుజూటంబు పై
            జను లేప్రొద్దుఁ బ్రశంస సేయ నవతంసం బైతి నీప్రాభవం
            బునకుం బాంధ జనాపకారి యగు నా పూవిల్తునిం గూడి వా
            రని దిష్కీర్తిగ దిట్టులం బడకు చంద్రా! రోహిణీవల్లభా !

        మ. నవలావణ్యపయోధిఁ జిత్త మనును మంథానాద్రికిం జంద్రికా
            పవనాశిం దరి త్రాడుగాఁ బెనఁచి యబ్జాతాసనుం డేర్చినన్
            రవళిం గోకిలకీరముల్గరువ నా రత్నాకరంబందు ను
            ద్భవముం బొందిన లక్ష్మి గావలయు నప్పద్మాక్షి వీక్షింపఁగన్.

        చ. కొనకొని తావి మూర్కొనని క్రొవ్విరి యెయ్యెడ వజ్రసూచి రా
            యని రతనంబు జిహ్వ చవియానవి తేనియ గోరు మోసి గి
            ల్లని చిగురాకు లాలితవిలాసని కేతన మా లతాంగి తా
            ననుభవకర్త యే ఘనుఁడొ యా విధి యత్న మెఱుంగ నయ్యెడున్.

        ఉ. నాపయికూర్మి తద్గురుజనంబులపై నడి మౌనికన్యకా
            స్థాపితవృత్తి బంధువనితాతతియందు ఘటించి యిష్టస
            ల్లాపములందు నిచ్చటుఁ దలంపక నిచ్చలుఁ బ్రాణనాథసే
            వాపరతంత్రవై యెటులు వన్నియఁ దెచ్చెదొ నాకుఁ బుత్రికా [1]

  1. [పినవీరన నివాసము నెల్లూరు జిల్లా బిట్రగుంట సమీపమండలి సోమరాజుపల్లెగాఁ దోఁచినను, నిజాము రాష్ట్రమునందలి పిల్లలమఱ్ఱియే నివాసమై యుండవచ్చునని శ్రీ చాగంటి శేషయ్య గారు తెల్పుచు న్నారు. ఇతఁడ నియోగియనియు, భారద్వాజ గోత్రుఁడనియు శ్రీ శేషయ్య గారు నిర్ణయించి యున్నారు. (ఆంధ్రకవి తరంగిణి, సం. 6, పినవీరన్న చరిత్ర) శ్రీ సాళ్వ నరసింహరాయని పేర నవరత్నములు, రాజ్యాంగ పద్దతులు రచింపఁబడినవని, వానికర్త పినవీరన్న కావచ్చునని శ్రీ ప్రభాకర శాస్త్రిగారు వ్రాసి నారు ]