పుట:Aandhrakavula-charitramu.pdf/693

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

666

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

యైన సాళువ గుండనృసింహరాజునుబట్టి తెలియవచ్చినట్టు కవికాలనిర్ణయాదులైన చరిత్రాంశము లేవియుఁ దెలియరావు. ఈ నరసింహరాజు కృతి భర్త యగుటయే కాక కృతికర్తసహితమయి సంస్కృతమున రామాభ్యుదయమను గ్రంథమును జేసెను. శ్రీనాథుని కాలములో నుండిన గౌడ డిండిమకవిసార్వభౌమబిరుదాంకితుని కుమారుఁ డగు రాజనాధుఁ డను తృతీయడిండిమకవిసార్వభౌముఁ డీసాళువగుండ నరసింహునినాయకునిగాఁ జేసి సంస్కృతమున సాళువాభ్యుదయ మను కావ్యమును జేసెను. ఈ సాళువ నరసింహరాజు మహాప్రసిద్ధుఁ డగుటచేత నాతనిమీఁదఁ గవులనేకులు పద్యములు చెప్పిరి. అట్టి పద్యములలో రెంటి నిందుదాహరించెదను.

    సీ. దినదినంబును నెల్లడివిరాజులఁ బోషించుఁ
                         గైరవబంధుఁ డే కార్యకాంక్ష?
       అప్పటప్పటికి లోకాంధకారము మాన్చు
                         నినుఁ డేమి లాభంబు నిచ్చగించి ?
       సచరాచరంబైన జగతి యెల్ల భరించు
                         ఫణిపతి యే ఫలప్రా ప్తిజూచి ?
       అదనున వర్షించి యఖిలజీవులఁ బ్రోచు
                         జలధరంబే ప్రయోజనముఁ గోరి ?

       పరహితం బాత్మహిత మని పరమపుణ్యు
       లన్యు లోనరించు మేలు తా మాసపడరు
       సకలభాగ్యోదయ! కరారి సాళువాంక
       గుండ భూపాలనరసింహమండలేంద్ర!

   సీ. బంగారునకు సౌరభము జనించినయట్టు
                కులజుఁడు త్తమగుణకలితుఁ డేని;
       కస్తూరి నికరంపుఁగాంతిఁ జెందినయట్టు
                లుత్తమోత్తముఁడు శ్రీ నొందెనేని:
       భావింపఁ జెఱకునఁ బండుపండినయట్టు
                నెఱదాత ప్రియవచోనిరతుఁ డేని;