పుట:Aandhrakavula-charitramu.pdf/675

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భైరవకవి


ఈ కవి శ్రీరంగమహత్త్వమును, రత్నశాస్త్రమును, కవిగజాంకుశమును జేసెను. వీనిలో శ్రీరంగమాహాత్మ్యము ప్రధానమైనది. ఈ గ్రంథము చాగయామాత్యుని పుత్రుఁడైన రాఘవమంత్రి కంకితము చేయబడినది. రామామాత్యుఁ డని నామాంతరము గల యీ రాఘవమంత్రి మాధ్వుఁడని తోచుచున్నది. ఇతఁ డే కాలమునందుండెనో యే రాజుమంత్రియో పుస్తకమువలనఁ దెలియరాదు. అయినను కృతిపతి యన్న విఠ్ఠలేశ్వరుఁ డీ విధముగా వర్ణింపఁబడెను.

సీ.చండదిగ్వేదండకాండధూర్వహమహీ
                         మండలోద్ధరణసమర్ధ మగుచు
          దుర్వారపరిపంధిసర్వసంపద్గర్వ
                         నిర్వాపణక్రియానిపుణ మగుచు
          వేదాదివిద్యావినోదవిద్వజ్జనా
                         మోదాతిశయసముత్పాది యగుచు
          జంభజిన్మదకుంభికుంభీనసాధీశ
                         శంభుభూభృద్ద్యుతిస్వచ్ఛ మగుచుఁ

          బరఁగు నే మంత్రిభుజబలప్రకటశౌర్య
          దానసత్కీర్తు ల ప్రతిమానమహిమ
          నాతఁ డిమ్మడిసై పఖానాధిరాజ్య
          భారధుర్యుడు విఠ్ఠల ప్రభువరుండు.

ఇం దిమ్మడి యనియు, సైపఖా ననియు, రెండు పేరు లుదాహరింపఁబడి యున్నవి. ఈ రెంటిలో నిమ్మడి యనునది ప్రౌఢ దేవరాయని నామాంతరము. ఇమ్మడిదేవరాయ లనఁబడెడు ప్రౌఢదేవరాయలు 1423 మొదలుకొని 1447వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసెను. ఈ విఠ్ఠల