పుట:Aandhrakavula-charitramu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

ఆంధ్ర కవుల చరిత్రము

ఉ. శారదరాత్రు లుజ్జ్వలలసత్తర తారకహారపంక్తులన్
    జారుతరంబులయ్యె వికసన్నవకై_రవగంధబంధురో
    దారసమీరసౌరభము దాల్చి సుధాంశువికీర్యమాణక
    ర్పూరపరాగపాండురుచిపూరము లంబరపూరితంబులై.

అనునది కడపటి పద్యము. ఈ పద్యమునందలి నాల్గవ చరణములోని "రుచిపూరము లంబరపూరితంబులై " యని యున్నచోట ' రుచిపూరములు + అంబరపూరితంబులై " యనుటకు మాఱుగా 'రుచిపూరములం + బరపూరితంబులై " యని పదవిభాగము చేసి యక్కడనుండి పయి పద్యము లన్నియు నన్నయవి గాక పరపూరితము లన్న యర్ధము స్ఫురించుచున్న దని యొకానొకరు చమత్కారముగా వ్రాసియున్నారు. ఈతనిది మృదు వయిన సులభశైలి; కవిత్వము ద్రాక్షాపాకమయి మిక్కిలి రసవంతముగా నుండును. ఈయన కవనమందించుమించుగా రెండు వంతులు సంస్కృత పదములను, ఒకవంతు తెలుఁగుపదములును నుండును. ఈ యంశము లీయనకవిత్వధోరణిని జూపుటకయి యిందు క్రింద నుదాహరింపఁబడిన పద్యములవలనఁ దెలిసికోవచ్చును.

    
     క. అడవులు నేఱులు నవి నీ
         పడసినయవి యెట్లు పుణ్యభాగీరధి యి
         ప్పుడమిఁ గలవారి కెల్లను
         నెడపక సేవ్యంబకాక యిది నీయదియే. [ఆది. అ 7-41]

     ఉ. వీరుఁడు వీఁడు పాండవుఁడు వృష్ణికులోత్తములై న సీరిదై
         త్యారు లెఱుంగకుండఁగ మహారధుఁడై తరుణిన్ సుభద్ర నం
         భోరుహనేతఁ దోడ్కొనుచుఁ బోయెడు నీతనిబోవ నిచ్చినన్
         ధీరుఁడు మాధవుండు బలదేవుఁడు నల్గుదురంచు నడ్డమై
                                                  (ఆది.ఆ 8 -199)
     మ. కురు వృద్దు ల్గురువృద్ధబాంధవు లనేకు ల్చూచు చుండ న్మదో
         ద్ధరుఁడై ద్రౌపది నట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ