పుట:Aandhrakavula-charitramu.pdf/591

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

564

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

లయిన పార్వతీపరమేశ్వరులను గూర్చి యిటువంటి దూష్యపద్యములను జెప్పి యుండునా  ? కాళేశ్వరీ యనఁబరఁగిన పార్వతీదేవిని గూర్చిన పద్య మిది.

      చ. గొఱియల మేఁకపోతులను గొమ్ముపొటేళ్ళను గావుఁ గొందు వీ,
          వరయఁగ సందెకాడఁ దగ వత్తు నంచు భవచ్ఛిరంబుపైఁ
          గర మిడి పోయినట్టి తిలఘాతుకురాలితదీయ
          పెఱుకగలేవు నీవు నొకభీకరమూర్తి వె కాళికేశ్వరీ!

ఒకానొక తిలఘాతుకురాలు వ్యభిచారార్ధము సందెకడ వచ్చెద నని కాళికాదేవి నెత్తిమీఁద చేయి పెట్టి బాసచేసి పోయెనఁట ! అట్టి ఘోరప్రమాణము చేసియు నట్టి సత్కార్యమునిమిత్త మా తెలికది తానన్న వేళకు రాకుండె నఁట ! అందుమీఁద భక్తుఁ డలిగి నీవు గొఱ్ఱెలు మొదలయిన జంతువులను బలిగొనుటయే కాని నీ శిరస్సుపైని జేయి వేసి వచ్చెద నని బాసచేసి రాక పోయిన తిలఘాతుకురాలిరోమములు పీఁకఁగలిగితివా ? యని మృదువచన ములతో పార్వతీదేవి నడుగుచున్నాఁడు ! ఇట్టి యర్థమును శివభక్తాగ్రేసరుఁడైన శ్రీనాధునకే కాదు భక్తిహీనుఁడై న సామాన్య హీనమానవున కారోపించుట సహితమవమానకరమే. అనర్థదాయకమైన యర్థము నటుండనిచ్చి యిఁక నీ పద్యమునందలి పదసౌష్టవసౌభాగ్యమును విచారింతము. సందెకడ నని యుండవలసినదానికి సందెకాడనని యున్నది.తిలఘాతుకురాలి తదీయ శ ములనుచోట సమాసమధ్యమునందున్న తదీయ కర్థములేదు, శ...ము అన్న పదమునకు పామరజనవ్యవహారములోనే కాని సంస్కృతమునఁ గవి యుద్దేశించిన యర్ధము లేదు. ఈ పద్యమే శ్రీనాథుని దనెడు పక్షమున నాతనికి శబ్ద జ్ఞానము లేదు, వ్యర్థపద ప్రయోగశంకలేదు, అశ్లీల భయము లేదు. రేపశకటరేఫఙ్ఞానము లేదు అని చెప్పవలసి వచ్చును ఈ పద్యమునఁ ప్రాసస్థానములైన గొఱియలలోనిది శకటరేఫము; ఆరయఁగలోనిది రేఫము. ఈ పుస్తకములోని పార్వతీనాధుఁ డయి గరళకంఠుఁడనఁబరఁగెడు పరమేశ్వరునిఁ గూర్చిన పద్యమిది.