పుట:Aandhrakavula-charitramu.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

544

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

             నా సుందరాంగి దాక్షారామమునఁ బుట్టు
                        భువనమోహినీ చిన్ని పోతి యనఁగ
                                                      [క్రీడాభిరామము]

ఈ భీమేశ్వరపురాణము శృంగారనైషధమువలెనే సంస్కృతపద భూయిష్ఠముగా నున్నను చక్కని లోకోక్తులతోను, భాషీయములతోను నిండియుండి మంచి కవిత్వశైలిని నేర్చుకోనఁగోరువారి కనుకరణీయములైన రచనావిశేషములతోడఁ గూడి రసికజనహృదయంగమముగా నున్నది.

ఎక్కడనుండి యైనఁ గ్రొత్తగా నొక కవీశ్వరుఁడు గాని పండితుఁడు గాని తమపట్టణమునకు వచ్చినప్పు డచ్చటి పండితులు మత్సరగ్రస్తులయి యా నూతనవిద్వాంసుని నాక్షేపించుటయుఁ బరాభవింపఁ జూచుటయు సామాన్యములే గదా ! శ్రీనాధకవి కర్ణాటక దేశమునుండి రాగానే రాజమహేంద్ర పరమునందలి పండితులు శ్రీనాథుని కవిత్వమంతయు సంస్కృతభాషయే యనియు, మాటల చమత్కారముచేతఁ దెలుఁగుభాషలాగునఁ గనఁబడు చున్నను నిజముగా కర్ణాట భాషాధోరణియే యనియు, ఆక్షేపింపఁ జొచ్చిరి. ఈ యాక్షేపణములను మనస్సునం దుంచుకొనియే శ్రీనాథుఁడు రాజమహేంద్రవరపండితులమీఁది కోపముచేత కుకవిదూషణ మను నెపముచేత భీమఖండములో నీ క్రింది పద్యములను వేసెను -

          గీ. బోధ మల్పంబు గర్వ మభ్యున్నతంబు
             శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము
             కూపమండూకములఁబోలెఁ గొంచె మెఱిఁగి
             పండితంమన్యులైన వైతండికులకు.

          గీ. నీటమున నుండి శ్రుతిపుటనిష్ఠురముగ
             నడరి కాకులు బిట్టు పెద్దఱచినప్పు
             డుదధి రాయంచ యూరక యుంట లెస్స
             సైఁప రాకున్న నేందేనిఁ జనుట యొప్పు