పుట:Aandhrakavula-charitramu.pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

499

శ్రీనాథుఁడు

              సమదారిరాయవేశ్యాభుజంగుండు వే
                         మయరాచవేమనక్ష్మావరుండు

              తల్లి సూరాంబచే సముత్పన్న మగుచుఁ
              బరఁగు సంతానవార్థి వరుసగాఁగ
              నొలయు గిరివాహినుల జగనొబ్బగండ
              కాలువ ఘటించె నా తారకంబుగాఁగ. "శ్రీనాధకృతి"

ఈ రెండు శాసనములకును నడిమికాలములో శ్రీనాథునిచే రచియింపఁబడిన తామ్ర శాసన మొకటి కనఁబడుచున్నది. దాని నాలపాడు శాసనమందురు . అది 1413-వ సంవత్సరము న రచియింపఁబడినది. ఆ తామ్ర శాసనము నిందు క్రిందఁ బొందుపరుచుచున్నాను.

          శ్లో. కళ్యాణం జగతాం తనోతు స విధుః కాదంబినీ మేచకః
             క్రీడాక్రోడతనుః పయోధిపయసో విశ్వంభరా ముద్వహన్,
             భారాపేతఫణావివర్తనవశా న్మోదాయ యస్యాభవ
             న్నిర్యత్నా భుజగేంద్రమౌళిమణిభి ర్నీ రాజనప్రక్రియా. 1

             లీలాద్యూతజితాం కళాధరకళాం మౌళౌ దృఢం కీలితా
             మాహర్తుం యుగ మున్నమయ్య భుజయో ర్విక్లేశ యంత్యా మిధ8,
             పార్వత్యాః కుచకుంభపార్శ్వయుగళే సుప్రేమలోలేక్షణః,
             కాలక్షేపణ మిందు మోచనవిధౌ కాంక్షన్ శివః పాతునః 2

             భవతు భవతాం ఫలాప్యై కల్పలతా కాపి కరటిరాజముఖీ,
             మధుర సుధారసధారామధులవలలితేందుమంజరీమంజుః. 3

             తమో హరేతాం తవ పుష్పవంతౌ
             రాకాసు పూర్వాపరశైలభాజౌ