పుట:Aandhrakavula-charitramu.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

498

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

శ్రీనాధవిరచిత మైన రెండవ శాసనము ఫిరంగిపురమున కంటియున్న యమీనాబాదు గ్రామసమీపమునందున్న యొక గుట్టఁమీదఁ జెక్కఁబడియున్న శిలా శాసనము. అందుచేత దీని నమీనాబాదుశాసనమందురు. ఈ శాసనము సంతానసాగరమను పూర్వోక్తతటాకముసకు నీరు వచ్చుటకయి జగనొబ్బ గండకాలువ యను పేరితో 1332-వ శకవర్షముసకు సరియైన మన్మథ సంవత్సర మాఘశుద్దపూర్ణిమనాఁడు సూరాంబయెుక్కయుఁ, బెదకోమటి వేమభూపాలునియొక్కయు కుమారుఁడైన రాచవేమారెడ్డి త్రవ్వించి ప్రతిష్టించిన సందర్భమునఁ జెక్కింపఁబడినది. ఈకాలువ త్రవ్వించిన కాలము క్రీస్తు శకము 1416 అగును, ఈ కాలమునాటికి గోమటివేమారెడ్డి జీవించియే యుండెను. అతఁడు జీవించియుండఁగానే యీ కాలువ యేల కొడుకు పేరఁ ద్రవ్వింపఁబడెనో తెలియకున్నది. ఆ సంవత్సరమునఁ గాటయవేమారెడ్డి మృతినొందఁగా రాజమహేంద్రవరరాజ్యము నాక్రమించుటకయి పెద్ద కోమటివేమభూపాలుఁడు దండెత్తి పోయినప్పడు కొండవీటి పాలనమునకు రాజ వేమారెడ్డిని నియమించి యుండును. పెదకోమటివేమభూపాలుఁడు రాజమహేంద్రవరరాజ్యసంపాదన ప్రయత్నమునందు లబ్దమనోరధుఁడు గాక యల్లాడ రెడ్డిచేత నపజితుఁడయి, హతశేష సైన్యముతో నిజరాజదానిని మరలవలసినవాఁ డయ్యెను. కొండవీటిరెడ్డిరాజులకు జగనొబ్పగండబిరుద ముండెను దానికి జగదేకవీరుఁడని యర్ధము. అందుచేతనే కాలువకు జగనొబ్బగండకాలువ యని పేరు పెట్టఁబడెను, శ్రీనాథకవివిరచిత మయిన యీ శాసనము నిందు క్రిందఁ బొందు పఱచుచున్నాసు.

              సీ. శాకాబ్దములు సహస్రంబును మున్నూట
                             ముప్పదియేడును నొప్పు మిగుల
                  మహనీయమైన మన్మథవత్సరంబున
                             మాఘమాసముగపూఁర్ణిమాదినమున
                  హేమాద్రిదానచింతామణి యరిరాయ
                       బసవశంకరుఁ డాజిఫల్గుణుండు