పుట:Aandhrakavula-charitramu.pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

482

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

అనుదానిలోని మందాక్షేత్యాదిప్రథమచరణమును

          గీ. రమణి మందాక్ష మందాక్షరంబు గాఁగ"

అని తెనిఁగించెను. ఇందును మూలములోని పదములలో మార్పేమియు లేక తెలుగగుటకు కడను బువర్ణకము చేర్పబడెను. ఇటువంటి వనేకములు గలవు. ఇట్టి భాషాంతరములను జాచి యా కాలపు విద్వాంసులు శ్రీనాధునితో "నీడూలును మూలునుదీసికొని మా నైషధమును మామీఁదఁ బాఱ వేయుము" అని పరిహాసముగాఁ బలికి రని యొక కథ చెప్పుచున్నారు. దానికి బహుస్థలములయందు సంస్కృత విభక్తికి మాఱుగా తెలుఁగువిభక్తి ప్రత్యయములై న డుములను జేర్చుట తప్ప వేఱుభాషాంతరము లేదని తాత్పర్యము. తెనుఁగున గమనార్థకమైన సకర్మకక్రియ లేనప్పడు 'గమి కర్మీకృత నై కనీవృతుఁడనై_" యనుటకంటె ' అనేక దేశములను దిరిగిన వాఁడనై " యను నర్ధ మిచ్చెడు వేఱొక వాక్యమును వాడుటయే సముచిత మని తోఁచుచున్నది. ఇట్టి భాషాంతరములు సంస్కృతపాండిత్యము గల విద్వాంసులకే కాని సామాన్యాంధ్రభాషాజ్ఞానము గలవారికి బోధపడవు. కొన్నిచోట్ల భాషాంతర మెట్లున్నను మొత్తముమీఁద నైషధాంధ్రీకరణము సర్వజనశ్లాఘాపాత్రముగా నున్నదనుటకు సందేహము లేదు.

                 శ్లో. విజ్ఞాపనీయా న గిరో మదర్థాః
                     కృథా కదుష్ణే హృది నైషధస్య ?
                     పిత్తేనదూనే రసనే సితాపి
                     తిక్తాయతే హంసకులావతంసః

                 గీ. అధికరోషకషాయితస్వాంతుఁడైన
                     నరపతికి విన్నవింపకు నా యవస్థ
                     పైత్యదోషోదయంబునఁ బరుస దై న
                     జిహ్వకును బంచదారయుఁ జేఁదుగాదే !