పుట:Aandhrakavula-charitramu.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

481

శ్రీనాథుఁడు

           శ్లో. సువర్ణదండైకసితాతపత్రితజ్వలత్ప్రతాపావళికీర్తిమండల8."-
                               ప్రథమ సర్గము. శ్లో.2 అను భాగము.

           సీ. “తపనీయదండైకధవళాతపత్రితోద్దండతేజ కీర్తిమండలుండు" అని తెనిఁగింపఁబడినది. ఇందు "సువర్ష" యనుటకు 'తపనీయ' యనియు, 'సితి" యనుటకు 'ధవళ' యనియు, సంస్కృతపదములకు సంస్కృతపర్యాయపదములు వేసి గణయతిప్రాసముల కనుకూలముగా దీర్ఘసమాసమును జేయుట తప్పఁ దెలిగించిన దేదియులేదు. కడపట "కీర్తి మండలః" లను దానిని 'కీర్తిమండలుం' డని తెనుఁగువిభక్తి తోఁ గూర్చుట మాత్రమే యిందున్న తెలుఁగు.

            శ్లో. సరశీః పరిశీలితుం మయా
                గమికర్మీకృతనైకనీవృతా,
                అతిథిత్వమనాయి సా దృశోః
                సదసత్సంశయగోచరోదరీ.
                                    సర్గ 4. శ్లో.40

అనుదానిలోని గమకర్మీకృతేత్యాదిభాగమును

మ. 'గమి కర్మీకృతినైకనీవృతుడనై కంటిన్ విదర్భంబునన్' అని మార్పేమియు జేయక తుదను విభ_క్తి ప్రత్యయమైన డువర్ణకమును మాత్రము చేర్చి తెనుఁ గనిపించెను.

             శ్లో. మందాక్షమందాక్షరముద్ర ముక్త్వా
                 తస్యాం సమాకుంచితవాచి హంసః,
                 తచ్ఛంసితే కించన సంశయాళు
                 ర్గిరా ముఖాంభోజ మయం యుయోజ. -సర్గ 3.శ్లో. 20