పుట:Aandhrakavula-charitramu.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

457

శ్రీనాథుఁడు

వేమభూపాలుఁ డనుజులకే బహుభూము లిచ్చె నన్నప్పు డగ్రజుడైన మాచన్న కిచ్చినట్లు వేఱుగఁ జెప్ప నక్కఱయే లేదు. ఆతని కొకచిన్న సంస్థాన మిచ్చి దాని కతనిని విభునిగాఁ జేనెను. 'ఆదిరాజన్యతుల్యాచారవిధి మాచవిభుఁడు పూజ్యం డను విశ్రుతియును" అను హరివంశ పద్య మీ యంశమును సూచించుచున్నది. తనకు రాజ్యమే లేనియెడల మాచన్న విభుఁడగుటయు. నాదిరాజన్యతుల్యాచారుఁడగుటయు సంభవింపవు గదా ! మాచన్న రాజయినట్టు ఫిరంగిపుర శాసనములోని యీక్రింది శ్లోకమువలనను దెలియవచ్చుచున్నది.

           శ్లో. మాచక్షోణిపతి ర్మహేంద్ర విభవో వేమక్షితీశాగ్రజో
               హేమాద్రే స్సదృశో బభూవసుగుణైస్తన్య త్రయో నందనాః

ఒక కుమారునకు దండ్రి పేరు పెట్టుట మనలో సాధారణమైన యాచారము. అందుచేత మాచనయు వేమనయు తమ పుత్రులలో నొక్కరికిఁ గోమటి యని పేరు పెట్టిరి. ఈ యిద్దఱు కోమటిరెడ్లకును భేదము తెలియుటకయి మాచన్నకొడుకు పెదకోమటి యనఁబడుచుండెను. కోమటి గాక ప్రోలయవేమారెడ్డికి ననపోతుఁ డనియు, ననవేముఁ డనియు మఱి యిద్దఱు పుత్రులు కూడఁ గలిగిరి. ఎఱ్ఱాప్రెగడ హరివంశము రచించు నాఁటి కనవేమారెడ్డి మిక్కిలి పసివాఁడు; కోమటిరెడ్డి మృతుఁ డయ్యెను. తండ్రికాలములోనే యనపోతారెడ్డి దండనాధుఁ డయినట్టు హరివంశములోని యీ క్రింది పద్యమునఁ జెప్పఁబడెను.

          శా. వేమాక్ష్మాధిపుకూర్మి పుత్త్రుడు దయావిభ్రాజి యవ్యాజతే
               జోమార్తాండుఁడు కీర్తనీయగుణసంస్తోమంబులం దేమియున్
               రామస్పూర్తికి లొచ్చుగాక సరియై రాజిల్లె రాజార్చితుం
               డాముష్యాయణుఁ డెందుఁ బోతయచమూపాగ్రేసరుం డిమ్మహిన్.

హరివంశమునందే యీతని పెదతండ్రికుమారుఁ డయిన కోమటిరెడ్డి యిట్లు వర్ణింపబడెను.