పుట:Aandhrakavula-charitramu.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

382

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

          గేలను లే దా కొక్కటి
           తాళము ముత్తునియ లగుచు ధరపైc బడుమా !

ఇందుc జెప్పఁబడిన సాళువ పెద్దతిమ్మరాజు పదునేనవ శతాబ్దములోని వాఁ డగుటచే భీమకవి యీతనికిఁ దరువాతివాఁ డయి యుండడు. ద్వితీయ పాదమున ప్రౌఢకవి మల్లన బ్రహ్మదండిముండ్లు చాలఁ దిట్టినట్లు చెప్పఁబడిన పద్య మిది

        క. గుడి యన్న నృపతిఁ బొడఁగన
           నడవంగాఁ గొcడపల్లి నగరిపడమటన్
           గుడి యెడమ మడమఁ గాడిన
           చెడుముండులని బ్రహ్మదండిచెట్టున డుల్లున్.

ఈ ప్రౌఢకవి మల్లన పదునేనవ శతాబ్దాంతమునం దుండినవాఁ డగుటచేత నీతనికిఁ దరువాత భీమకవి యుండి యుండఁడు. తృతీయపాదమంందలి కవి భానుఁ డెవ్వఁడో తెలియ రాలేదు. చతుర్థపాదమున బడబానల భట్టు తెలుగురాయఁడు కట్టించిన చెఱువునీ ళ్లింకఁ దిట్టినట్లు చెప్పఁబడిన పద్య మిది.

        క. బడబానల భట్టారకు
           కుడిచేయుంగరము రవికి గొబ్పున నర్ఘ్యం
           బిడు వేళ నూది నీలో
           బడియెఁ దటా కంబ నీటిఁ బాయుము వేగన్.

తెలుఁగురాయనికాలము ముందే చెప్పఁబడినందున నాతనికి దరువాతనున్న బడబానల భట్టుకాలమునకుఁ దరువాతను భీమకవి యుండియుండడు. అప్పకవీయములో నుదాహరింపఁబడిన పై పద్యముల నన్నిటిని జదివి నడుమను గొంత తన కవిత్వము పెట్టి వ్యాకరణజ్ఞానము చాలని యిటీవలి మహాకవి యెవ్వఁడో భీమకవి పేరు పెట్టి యూ పద్యము నల్లి యుండును. ఒకవేళ భీమకవి మైలముభీమనకాలములోనే యుండినను, ఆ భీమన పదునొకండవశతాబ్దములోవాఁడు గాక, యాతని సంతతి వాడయిన మఱిియొక మైలముభీమన కావచ్చును. శ్రీనాథకవికృతమయిన