పుట:Aandhrakavula-charitramu.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

370

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

         శా. "అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
              భిక్షాదానము చేయురా సుకవిరాడ్బృందారకశ్రేణికిన్
              దాక్షారామపురీవిహారవరగంధర్వాప్సరోభామినీ
              వక్షోజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్."

ఈ తెలుఁగురాయఁడు మరణము నొందుటచేతఁ గస్తూరికాదానము చేయువారు లేరని శ్రీనాథుఁడీ సీసపద్యపాదమున విలపించియున్నాఁడు.

             'రంభఁ గూడెఁ దెలుంగురాయరాహుత్తుండు
              కస్తూరి కే రాజుఁ బ్రస్తుతింతు'

విమలాదిత్యునితండ్రి యైన దాననృపాలుఁడు మూఁడు సంవత్సరములు రాజ్యము చేసిన తరువాత కళింగు లాతనిని రాజ్యపదభ్రష్టునిఁ జేసి రాజ్యమును తా మాక్రమించుకొనిరి. ఆ కాలములో భీమకవి యున్నట్టును, అప్పుడు రాజ్యపాలనము చేయుచున్న కళింగగంగును తిట్టినట్టును కొందఱు చెప్పుచున్నారు. ఈ కవి యొకనాఁడు రాజసందర్శనార్థమయి పోఁగా రాజ కళింగగంగు కార్యభారములో మునిఁగియుండి యసమయమగుటచే కోపపడి "యిప్పడు సందడిగానున్నది. సందడి తీఱిినతరువాత రమ్ము" అని కేక వేసెనట ! అందుమీఁద భీమన యాగ్రహపడి

          ఉ. వేములవాడ భీమకవి వేగమె చూచి కళింగ గంగు తా
              సామము మాని కోపమున సందడి దీఱిన రమ్ము పొమ్మనెన్
              మోమును జూడ దోష మిఁక ముప్పది రెండు దినంబులావలన్
              జామున కర్ధమం దతినిసంపద శత్రులఁ జేరుఁగావుతన్.

అను పద్యమును జెప్పెనఁట ! ఈ వాక్యము శాపమయి తగులఁగా శత్రు రాజు లాతనిరాజ్య మాక్రమించుకొని యాతనిని వెడలగొట్టిరcట ! తరువాత నతఁడు శత్రుభీతిచేత మాఱువేషముతో నూరూరఁ దిరుగుచు నొకనాఁటిరాత్రి చీఁకటిలో భీమకవి యింటిముందరి పాఁతర గోతిలో కాలుజాఱి పడి, అంత బ్రతుకు బ్రతికిన మహారాజున కిప్పు డొక్కకాలి దివ్వటి యైన లేకపోయెనే యని ఖేదపడెను అప్పడు పాదప్రక్షాళణమున కయి వెలుపలికి వచ్చిన భీమకవి యా మాటలు విని 'నీ వెవ్వఁడ ?' వని