పుట:Aandhrakavula-charitramu.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

369

వే ము ల వా డ భీ మ క వి

ఈ పద్యమునందలి తెలుంగాధీశ యనుదానిని వెలుంగాధీశయని దిద్ది దానికి విమలాదిత్యుఁ డని యర్థము చెప్పుటకంటె సాహసకార్యముండదు. తెలుంగాధీశుఁ డనఁగా తెలుఁగురాయcడు. రామవిలాసములో

       క. ఆ మాచనృపతిసుతుఁడు మ
          హామహుఁ డెఱపోతనక్షమాధీశ్వరుఁ డా
          శ్రీమంతుసుతులు జగదభి
          రాములు శ్రీ తెలుఁగురాయ రామనరేంద్రుల్.[1]

అని గుడిమెట్టరాజగు నెఱపోతరాజు కొడుకు తెలుఁగురాయఁ డొకఁడు చెప్పఁబడి యున్నాఁడు. ఈతెలుఁగురాయcడు పదమూడవ శతాబ్ది మధ్యమునం దుండినవాఁడు. కవి యూ తెలుఁగురాయనిఁ గూర్చియే యీ పద్యమును జెప్పినయెడల, ఇతఁడు తిక్కనకాలములోనో, తిక్కనకు గొంచె మీవలావలలనో యుండి యుండును. తిక్కన యీతన గ్రంథములలో బేర్కొనకుండుట కూడ నితఁడు తిక్కనకు పూర్వపువాఁడు కాఁడని తెలుపుచున్నది. పదమూడవ శతాబ్ది మధ్యమున నున్న యీ తెలుఁగురాయఁడు గాక కవులకు కస్తూరికాదానము చేయుటయందుఁ బ్రసిద్ధుఁ డయిన వేఱొక తెలుఁగురాయఁడు సాంపరాయని పుత్రుఁడు పదునాల్గవ శతాబ్దోత్తరార్ధమున నుండెను. భీమన కస్తూరిని వేఁడినది యీ తెలుఁగురాయనినే యయి యుండును. "తెలుంగాధీశ' యన్న ప్రయోగము వ్యాకరణ దుష్ట మగుటచేత నది 'కళింగాధీశ' యని యుండవలెనని యొకరు వ్రాయు చున్నారు. సంజ్ఞలయందును, బిరుదములయందును మనము వ్యాకరణ దోషములను బాటింపరాదు. కస్తూరికాదానమునకుఁ బ్రసిద్దికెక్కినవాఁడు తెలుఁగురాయఁడు కాని కళింగాధీశుఁడు కాఁడు. ఈ తెలుఁగురాయనినే కస్తూరి వేఁడెడి యీ క్రింది పద్యములో నీతనిఁ గూర్చి శ్రీనాధుఁడును *తెలుంగాధీశ" యనియే ప్రయోగించియున్నాఁడు.

  1. [ఇయ్యది పెద్దాపుర ప్రభువులు వత్సవాయివారి యాస్థానములోనుండిన
    ఏనుఁగు లక్ష్మణకవి విరచితము.]