పుట:Aandhrakavula-charitramu.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

339

హు ళ క్కి భా స్క రు డు

     భ్యుదయం బెప్పుడుఁ గోరుచుండ నిట నీ వుగ్రంబుగాఁ బల్క వ్ర
      య్యదు కంటే హృదయంబు వజ్రకఠినంబైయున్న దిప్పట్టునన్.
                                                [యుద్ధకాండ 2348]

తెలుఁగుభారతమును రచియించిన కవులవలెనే రామాయణమును రచించిన కవులును మూలగ్రంథమును మిక్కిలి సంగ్రహపఱిచి కథను కూడ కొన్ని చోట్ల నిష్టానుసారముగా మార్చివేసినారు. ఆందుచేత సంస్కృతమున నిరువదినాలుగువేల గ్రంథముగా నున్న రామాయణము తెనుగున పదునేను వేల గ్రంథమయినది. ఈ కవులు మొత్తముమీఁద గ్రంధమును సంగ్రహపఱిచినను, కొన్నిచోట్ల పెంచను సహితము పెంచిరి ఎట్లన యుద్ధకాండమునందు మాఘకావ్యమునందలి యేడవ సర్గము చేర్పఁబడినది. గ్రంధవిస్తర భీతిచేత సంస్కృతరామాయణమునకును తెలుఁగురామాయణమునకును గల భేదము లిం దేమియు వివరింపలేదు. హుళక్కిభాస్కరుని కవిత్వము మనోహరముగా నుండును. మల్లి కార్డున భట్టకవిత్వములో సంస్కృతపదములును, సమాసములు నధికముగా సున్నవి. మొత్తము మీఁద పుస్తకముశైలి యంతయు శ్లాఘనీయముగానే యున్నది. ఈ రామాయణము గాక హుళక్కిభాస్కరుఁడు దశగతు లను గ్రంథమును గూడ రచించి సాహిణి మారనికి అంకితముచేసెనని రామకృష్ణకవిగారు క్రీడాభిరామపీఠికలో వ్రాసిరి.

ఆంధ్రుల చరిత్రము ద్వితీయభాగములో శ్రీ చిలుకూరి వీరభద్రరావు గారు భాస్కరరామాయణ కర్తల నొక్కొకరినే యెత్తుకొని మల్లికార్డున భట్టునుగూర్చి "యితఁడు సాహిణిమారన యాస్థానకవి యగు భాస్కరుని పుత్రుఁడే యైన, వారియాజ్ఞాప్రకారము రామాయణము రచింపఁబూనిన వాఁడే యైనయెడల బాలకాండము మొదట కృతినాయకుని సంబోధింపక కాండాంతమున శివుని సంబోధించి యుండఁడనియు, కిష్కింధాకాండాదినున్న పద్యము సాహిణిమారనసంబోధనము కాక పోవుటయే కాక కాండాంతమునందలి పద్యములు రెంటిలో నొకటి శివుని గూర్చిన సంబోధనము కలది యనియు, సుందరకాండము మొధట సాహిణి