పుట:Aandhrakavula-charitramu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

298

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

           గీ. ధర్మతనయ యుష్మదా-జ్ఞానిగళవిని
              బద్దమగుచుఁ జిక్కువడియెఁ గాక
              విజయమత్తగజము విడివడ్డదో నడ్డ
              పాటు గలదె విష్టపత్రయమున.

           క. శ్రీకఁరుఁ డెదురునపుడు వ
              నౌకోధ్వజ మింద్రమకుట మర్జునతురగా
              నీకము దివ్యశతాంగము
              నా కవ్వడి కబ్పియున్న నతఁ డేమగునో.

           క. ఆ కర్ణుదురాలాపము
              లాకర్ణింపగ నసహ్యమై ద్రోణునితో
              నాకనదీసుతుఁ డనియె వ
              నౌకోధ్వజ మెఱుఁగ వచ్చునరుఁ జూపి తగన్.

కవిచింతామణియందు వెల్లంకి తాతంభట్టుచేత నుదాహరింపఁబడిన యీ క్రింది పద్య ముద్యోగపర్వములోని దయి యుండవలెను.

           శా. తృష్ణాతంతునిబద్ధబుద్ధు లగు రాధేయాదులం గూడి శ్రీ
               కృష్ణం గేవలమర్త్యుఁగాఁ దలఁచి మర్దింపంగ నుత్సాహవ
               వర్దిష్ణుండయ్యె సుయోధనుం డకట ! ధాత్రీనాథ ! యూహింపుమా
               యుష్ణీషంబునఁ గట్టవచ్చునె మదవ్యూఢోగ్రశుండాలమున్.

కూచిమంచి తిమ్మకవిచే సర్వలక్షణ సారసంగ్రహమునం దుదాహరింపఁబడివ యీ క్రిందిపద్యము భీష్మపర్వాదిదగటు స్పష్టము.
            క. పదిదినము లయిదుప్రొద్దులు
               పదఁపడి రెణ్ణాళ్ళు నొక్క పగలున్ రేయున్