298
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
గీ. ధర్మతనయ యుష్మదా-జ్ఞానిగళవిని
బద్దమగుచుఁ జిక్కువడియెఁ గాక
విజయమత్తగజము విడివడ్డదో నడ్డ
పాటు గలదె విష్టపత్రయమున.
క. శ్రీకఁరుఁ డెదురునపుడు వ
నౌకోధ్వజ మింద్రమకుట మర్జునతురగా
నీకము దివ్యశతాంగము
నా కవ్వడి కబ్పియున్న నతఁ డేమగునో.
క. ఆ కర్ణుదురాలాపము
లాకర్ణింపగ నసహ్యమై ద్రోణునితో
నాకనదీసుతుఁ డనియె వ
నౌకోధ్వజ మెఱుఁగ వచ్చునరుఁ జూపి తగన్.
కవిచింతామణియందు వెల్లంకి తాతంభట్టుచేత నుదాహరింపఁబడిన యీ క్రింది పద్య ముద్యోగపర్వములోని దయి యుండవలెను.
శా. తృష్ణాతంతునిబద్ధబుద్ధు లగు రాధేయాదులం గూడి శ్రీ
కృష్ణం గేవలమర్త్యుఁగాఁ దలఁచి మర్దింపంగ నుత్సాహవ
వర్దిష్ణుండయ్యె సుయోధనుం డకట ! ధాత్రీనాథ ! యూహింపుమా
యుష్ణీషంబునఁ గట్టవచ్చునె మదవ్యూఢోగ్రశుండాలమున్.
కూచిమంచి తిమ్మకవిచే సర్వలక్షణ సారసంగ్రహమునం దుదాహరింపఁబడివ యీ క్రిందిపద్యము భీష్మపర్వాదిదగటు స్పష్టము.
క. పదిదినము లయిదుప్రొద్దులు
పదఁపడి రెణ్ణాళ్ళు నొక్క పగలున్ రేయున్