పుట:Aandhrakavula-charitramu.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

297

అ ధ ర్వ ణా చా ర్యుఁ డు

బిందువులు; భాసమునొందెన్=ప్రకాశమును బొందెను; భాబుష్పభాష = ఒక సూర్యునిచేవచ్చిన భాష; వాని = అగ్నిమిత్రుని; అంధమున్= గ్రుడ్డితనమును; రాతీయ్యగ = నాశనపఱుపఁగా, అది = ఆ భాష; ఆంధ్రమనుంచు = ఆంధ్ర భాష యని; బరువడినందెన్ = ప్రసిద్ధినొందెను.)

పయి పద్యముల తాత్పర్యము—పూర్వ మొకప్పు డెండ యధికమయి యగ్నిపిడుగులు పడి యగ్నిమిత్రుని కన్నులు పోయెను; ఆతఁడు తనకు కన్నులియ్యవలసినదని సూర్యుని ప్రార్ధింపఁగా సూర్యు డతనిభక్తి కి మెచ్చి యతని కొక భాష ననుగ్రహించెను; ఆ భాషాప్రభావమువలనను, సూర్యానుగ్రహమువలనను మరల నగ్నిమిత్రున కంధత్వము పోయి కన్నులు వచ్చెను; ఆ భాష యాతని యంధతను బోగొట్టినందున దాని కాంధ్రభాష యని పేరు కలిగెను.

అధర్వణాచార్యుఁడు మొదట త్రిలింగశబ్దానుశాసన మను వ్యాకరణము నొకదానిని చేసి తరువాత వికృతివివేక మను వ్యాకరణ కారికావళిని రచించి నాఁడను వాడుక కలదు గాని యది సత్యముకాదు. ఈ కడపటిది యధర్వణ కృతము కానేరదు. వికృతివివేకమునం డాంధ్రశబ్దచింతామణిలో లేని లక్షణము లనేకములు చెప్పఁబడి యున్నవి. ఈ గ్రంథము సంజ్ఞా పరిచ్ఛేదము, సంధిపరిచ్ఛేదము, అజంతపరిచ్చేదము, హలంతసరిచ్చేదము, క్రియా పరిచ్చేదము అని యైదుభాగములుగా భాగింపఁబడి కారిక లనఁబడు మూఁడు వందల శ్లోకములను గలిగి యున్నది. ఈ కవి రచియించిన తెలుఁగు భారత మిప్పటికి మాకు దొరకనందున, కవి వంశాదులనుగూర్చి యేమియుఁ జెప్పజాలము. లక్షణగ్రంధములం దుడాహరింపఁబడిన పద్యము ణము. బట్టి చూడఁగా నితఁడు విరాటోద్యోగభీష్మపర్వములను రచించినట్లును, కవిత్వము రసవంతమయి సంస్కృతపదబహుళముగా నుండునట్లును తెలియవచ్చుచుస్నది. ఆప్పకవి విరాటపర్వములోని యూ క్రింది పద్యమల నుదాహరించియున్నాఁడు.