పుట:Aandhrakavula-charitramu.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

మంచివారి కీయవచ్చునని కవి తాత్పర్యమైనట్టు దానిక్రిందనే యున్న యీ పద్యము తెలుపుచున్నది.

     క. 'అని తగనివానిదెస నా
         మన సెప్పుడు రోయుగాన మతి వజ్ఞనవ
         ర్ణనలకు మిగిలిన సుగుణుని
         నినుఁ బొంది మదీయ కవిత నెగడుం బుడమిన్.'

ఈ కేయూర బాహుచరిత్రకవిత్వము రసవంతముగా నున్నది. ఇందుండి కొన్ని పద్యముల నిం దుదాహరించుచున్నాను.

     చ. దలముగ నెల్ల ప్రొద్దును లతానివహంబుల రాలు పుప్పొడుల్
         పులినతిలంబులై చెలువపూనఁగ మీఁదటఁ దేలు కేతకీ
         దళముల మొత్త మోడల విధంబు నటింపఁగఁ బాఱు బెద్దలై
         ఫల రసవాహినుల్ పరియుపాంతవనంబులఁ గొన్ని చోటులన్. ఆ.1

     ఉ. ఎప్పటియట్ల యింతిఁ గని యేడ్తెఱ మ్రొక్కిన దానివల్లభుం
         డప్పుడు దిగ్గన న్నెగసి యచ్చటఁ దోచిన వాఁడు దిట్టఁడై
         తప్పక యన్ని దిక్కులకుఁదా వెస మ్రొక్కి ప్రదక్షిణంబుతోఁ
         జప్పుడుగాఁగ మెచ్చుచును జంద్రమరీచికి మ్రొక్కె బల్మఱున్. ఆ.2
 
     మ. పగలెల్ల న్వెలి నిల్చి రాతిరి రహోభంగిన్ స్వగేహంబున
         ట్టుగమీఁదన్ వసియుంచి భార్యపయి దృష్టల్నిల్పి యుండంగఁబ్రొ
         ద్దగుడున్ గంజిమడుంగు పేర రజకుం డత్యాస్థ నేతెంచినన్
         మృగశాబేక్షణ లోచనావరణము ల్మెల్లం దగ న్విచ్చుచున్. ఆ.3

     చ. పనిచినఁ బోయి చూడ్కులకుఁ బండు వనందగు నుత్సవంబు నిం
        పెనయఁగఁ జూచి మళ్ళి తన యిక్కువకుం బెడగాఁ బథాంతరం
        బున మన మూని యింటి దెసఁ బోవుట మాని విభుండు మున్నుచే
        సిన యుపకారము ల్కఱచి చేడియ చింత యొనర్చె నాత్మలోన్ ఆ.3