పుట:Aandhrakavula-charitramu.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

        ఉ. 'శ్రీరమణిగృహాంగణము చెన్ను వహింప నలంకరింపఁగాఁ
             దోరణముం బ్రదీపమును దోహలియై యొడఁగూర్చెనాcదగం
             జేరి యురంబునంద తులసీవనమాలయుఁ గౌస్తుభంబు నొ
             ప్పారఁగ నుల్లసిల్లు హరి యన్నమతిక్కని ధన్యుఁ జేయుతన్.

         ఉ. హారిక పర్ఘకాంచనమయాచలసానువునందు నిర్జర
             స్ఫారవిలాసముం గలుగు జాహ్నవిఁ దాల్చిన శంకరుండు నీ
             హారకరావతంసుఁ డణిమాదిగుణప్రదవీక్షణుండు ది
             క్పూరితకీర్తిశాలి యగు కొమ్మయతిక్కనిఁ గాచుఁగావుతన్.

అను మొదటి రెండు పద్యములవలనను దశకుమారచరిత్రము తిక్కన సోమయాజి కంకితము చేయబడినట్లు దెలిసికోవచ్చును. కవి యిష్టదేవతా వందనాదులు చేసిన తరువాత

        "వ. అని యిష్ట దేవతా ప్రార్ధనంబును సుకవిచరణారవిందాభి వందనంబునుం జేసి నా రచియింపంబూనిన కృతి కధీశ్వరుండైన కొట్టరువు తిక్కనామాత్యునకు నిజస్థానం బగు విక్రమ సింహపురం బభి వర్ణించెద"

అని యేతత్పురవర్ణనమును తత్పురాధీశ్వరుఁ దగు మనుమసిద్దివర్ణనమును జేసి,

        "వ. ఇట్లు కీర్తిపాత్రంబైన మనుమసిద్ధిమహీవల్లభునకుఁ గరుణారస పాత్రంబైన కొట్టరువు తిక్కనామాత్యుండు నిజకులక్రమాగతం బగు మంత్రిపదంబున వర్తిల్లుచు.

         గీ. అందలంబు గొడగు లడపంబు మేల్కట్టు
             చామరములు జమిలిశంఖములును
             గంబగట్లు భూమి కానికగాఁగఁ బెం
             పెసఁగు రాచపదవు లెల్లఁ బడసె”

అని చెప్పి తిక్కన తన్ను రావించుట లోనగు విషయముల నిట్లు చెప్పెను

          సీ. వేఁగి విషయమున వెఱ్ఱి (ంటి) రా లనుపేర
                               నభిరామ మగు నగ్రహారమునకు