పుట:Aandhrakavula-charitramu.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

267

కేతన

              నగ్రణి యగువాని నభినవదండినాఁ
                      బొలుపు మీఱినవానిఁ బ్రోలనార్యు
              ననుఁగుcదమ్ముని సంస్కృతాదిభాషా కావ్య
                      కర్తృత్వమున నుతి గన్నవానిఁ
              గౌండిన్యగోత్రుని బండారు కేతదం
                      డాధీశుమఱఁది నధ్యయనపరుని
 
              మూలఘటికాన్వవాయసముద్రపూర్ణ
              హిమమయూఖుని మారయ కమలకమల
              వదన యగుసంకమాంబకు [1] వరతనూజుఁ
              గేతనార్యుని నన్ను విఖ్యాతయశుని.

వ. అత్యాదరంబున రావించి యాసనార్ఘ్యపాద్య తాంబూలాంబ రాభారణ దానాద్యుపచారంబులఁబరితుష్టహృదయం జేసి నీవు సంస్కృతాద్యనేక భాషాకావ్యరచనా విశారదుండ వగుట జగత్ప్రసిద్ధంబు గావున నొక్కకావ్యము రచియించి నన్నుఁ గృతిపతిం జేయవలయునని సగౌరవంబు గాఁ బ్రార్థించిన నేనును మత్కావ్యకన్యకకుఁ దగు వరుండగు నతని మనోరధంబు సఫలంబు గావింపఁదలంచి.

          ఉ. కొమ్మయశౌరిసూనున కకుంఠితకీర్తి విలాస మొందఁ గ
             ద్యమ్మున దండి చెప్పిన కథాక్రమ మొప్పఁ దెనుంగుబాస గ
             ద్యమ్మును బద్యముం బెరయ నంచితభావరసోదయాభిరా
             మ మ్మగునట్లుగా దశకుమారచరిత్రము చెప్పఁబూనితిన్.

ఈ దశకుమారచరిత్రకవిత్వము కవి చెప్పుకొన్నట్టు తిక్కన మెచ్చునంత రసవంతముగానే యున్నది. ఇందుండి కొన్ని పద్యము లిం దుదాహరింపఁబడుచున్నవి.

          చ. పలికిన నుల్కిపాటు మదిఁ బట్టుకొనంగ నెలుంగుదిక్కు చూ
              డ్కులు పచరించి యాత్మపతి ఘోషముచందము కారణంబుగాc

  1. [ కేతన తల్లి గంగమ, తండ్రి మ్రానయ యని విజ్ఞానేశ్వరీయము వలనఁ దెలియవచ్చుచున్నది.]