పుట:Aandhrakavula-charitramu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

233

న న్నె చో డ క వి

ఇత్యాదిస్థలములయందు దీర్షముమీఁది యరసున్నలను నిండుసున్నలనుగాc బ్రయోగించి యుండుటయే యూ కవియొక్క - ప్రాచీనతను తెలుపుచున్నదని కొంద ఱనుచున్నారు.

       ఉ. ఎంచినప్రేమ నీపదక మి మ్మని రుక్మిణి మున్నువేఁడుడుం
           బూంచినపూఁవు దక్కఁ బలుపోకలఁబోవుచు నుండు దేవుఁడున్
           డాంచినసొమ్ము చేరె నకటా మదిఁ గోరనిసత్యభామకున్
           నోంచినవారిసొమ్ము లవి నోమనివారికి వచ్చునే యిలన్.

అని పదునాల్గవశతాబ్లియం దున్న నాచన-సోముఁడు సహితము దీర్ఘము మీఁది యర్ధబిందువులను పూర్ణ బిందువులనుగా బ్రయోగించి యుండుటచేత నిది ప్రాచీనత కొక గుఱుతు కాదు.

                       క్రౌంచ పదము.

చంచుల నాస్వాదించుచు లేదూండ్ల కరువు ప్రియలకు నలCదుచు మైరోమాంచము లోలిం గంచుకితంబై పొడమఁగ నలరుచుఁ బులినములంగ్రీడించుచుసంభాషించుచుఁ ప్రీతింబొలుచుచుఁ జెలఁగుచుబొలయు సముద్యత్క్రౌంచగతుల్ వీక్షించుచు భాస్వజ్జ్వలనుఁడు శరవణ సరసికి వచ్చెన్.

అను దశమా శ్వాసములోని 3ం వది యగు క్రౌంచపదవృత్తము నుదహరించి, "ఇందుఁ గందసీసములవలెఁ బ్రతిపాదము రెండు భాగములుగా విభజింపబడి కందమువలెఁ బూర్వార్ధమునఁ బ్రాసమును ద్వితీయార్ధమున విశ్రమము మాత్రమే కూర్పఁబడియె. ద్వితీయప్రాసయతి మాత్రము నన్నయ, తిక్కన, కవిజనాశ్రయకారాది ప్రాచీనులు పాటించిరి కాని యప్పకవి తన్మర్మము తెలియక వదలెెను........................... ...........నన్నయకాలమునకే క్రౌంచపదము వృత్తము కావునఁ బ్రధమాక్షరవిరతి ముఖ్యమని ప్రాసమున్నను రెండు విరమస్థానములు ప్రయోగించిరి. ఇది నన్నెచోడుని ప్రాచీనత కొక గొప్ప కారణము." అని సంపాదకులైన రామకృష్ణకవిగారు ద్వితీయభాగపీఠికయందు వ్రాసిరి నా