పుట:Aandhrakavula-charitramu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

113

తి క్క న సో మ యా జి


          క. అంబర రవి శశిశాకా
             బ్దంబులు చనఁ గాళయుక్తి భాద్రపదపుమా
             సంబున నంబరమణిబిం
             బం బనఁదగు తిక్కయజ్వ బ్రహ్మముఁ జేరెన్.*

ఈ కవి కాకతీయగణపతిదేవుని కాలములో నుండినట్లు ప్రబల నిదర్శనము లున్నందునను, గణపతిదేవుఁడు పదుమూడవ శతాబ్ద మధ్యమువఱకు రాజ్యము చేసినందునను, ఈ పద్య మంతగా విశ్వాసార్హ మయినది కాదు. ఈ పద్యముయొక్క- సత్యమెట్టి దయినను, మన్మరాజును, దిక్కనసోమయాజియుఁ గాకతీయ ప్రభువైన గణపతిదేవుని కాలమునందుండుట నిశ్చయము. గణపతిదేవుఁడు 1260 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసినట్టును, ఆ సంవత్సరము మొదలుకొని యాతని కొమారితయగు రుద్రమదేవి పరిపాలనము చేసినట్లును, చరిత్రమును, శిలాశాసనాదులును తెలుపుడు చేయుచున్నవి. అక్కన, బయ్యన లనువారు మన్మరాజును రాజ్యవిహీనునిగాఁ జేయఁగాఁ దన ప్రభువుపక్షమునఁ దిక్కనసోమయాజి గణపతిదేవుని సభకుఁ బోయినట్టు సిద్దేశ్వచరిత్ర మను నామాంతరము గల ప్రతాపచరిత్రమను శైవ గ్రంధమునందు వ్రాయఁబడి యున్నది ** ఈ యంశమే యిటీవల నిప్పటికి నూటయేఁబది సంవత్సరములకు లోపలఁ

_________________________________________________________________________ *విల్సను దొర వారు తమపుస్తక వివరణ పట్టికలో నీపద్యమునే యుదాహరించి "అంకా నాం వామతో గతిః "** అనియున్న న్యాయమునుబట్టి పండ్రెండని యర్థమిచ్చెడు రవిశబ్దము తెలిపెడి 12 అంకెలను కుడి నుండి యెడమకడ 21 గా బెట్టి 1210 శాలివాహనశకమును గాఁ జేసిరి. అప్పుడది క్రీ శ 1288 అయి యించు మించుగా తిక్కన మరణ కాలము సరిపోవచ్చును గాని కాళయుక్తి సంవత్సరము కాదు.

[కొండఱు 'రవిశశి' అసు దానిని 'శశికవి' గాఁ జదువ వలెననిరి. ఆప్పడును 1210 యే యగును. అది సరికాదు.]

    • దీని రచయిత కాసె సర్వప్ప. ఇతడు...... ప్రాంతము వాఁడని 'ఆంధ్ర కవి తరంగిణి'.