పుట:2015.396258.Vyasavali.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

87

విన్నపము

భాష పాణిని కాలములో లౌకిజ భాషకాదు. అట్లే నన్నయ తిక్కనాచి కవులు వాడినకావ్యభాష ఇప్పటి దేశభాషకాదు. అది పుస్తకములు చదువుకొంటేనేగానిరాదు. దేశస్తులతో సహవాసము చేయడము చేతనే అలనాటయేది దేశభాధ. దేశభాషలో ఆలోచించిన విషయము వేరే మరిఒక భాషలో చెప్పడము భాషాంతరీకరణము. అన్యభాషలో విన్నది దేశభాషలోనికి మార్చుకొని భావమును తెలుసుకో వలెను. ఇట్లు చెప్పేవాడున్ను వినేవాడున్ను(వ్రాసేవాడున్ను చదివేవాడున్ను) ఉభయులూ భాషాంతరీకరణము చేసుకొంటేనే కాని ఒకరిభజ్వములు ఒకరికి తెలియకుండా ఉండేటట్లు ప్రాచీనభాష వాడడమువల్ల లాభములేదు సరేకదాశ్రమ ద్విగుణమవుతున్నది. కావ్యములలో కవులు ఔచితినిబట్టి ఎట్టి శబ్దములు వాడుకచేసినా చెల్లునుగాని లోక వ్యవహారములోను, జనసామాన్యమునకు వ్రాసేగ్రంధములలోను చెల్లకూడదు.

   ఈ పత్రికలో మొట్టమొదట చర్చించే విషయము వ్యావహారికభాష, దానిప్రవృత్తి, దాని ఉపయోగములు, దానిగౌరవము, దానిని ఉపేక్షించడమువల్ల దేశమునకు కలుగుతూవున్న నష్టములు.
   మే ము ఉ ద్దే శిం చి న ప్ర యో జ న ము:- ఇంగ్లండులో ఇంగ్లీషు, ఫ్రాంసులోంఫ్రెంచి ఎట్లున్నదో—అట్లే తెలుగుదేశములో పెద్దలు నోటను వాడే నేటి తెలుగుభాషకు సాధ్యమయినంత దగ్గరగా తెలుగువ్రాత తెచ్చి నోటిమాటా, చేతివ్రాత ఒకదానికొకటి పోషకములుగాచేసి, రెండింటికి సమముగా ప్రవృత్తికలిగించి, వ్రాత సార్ధకముగాను సులభముగాను చేసి, తెలుగువారు వ్రాసేదేకాక మాట్లాడేదికూడా సభ్యభాషే, అనే గౌరవము దేశమునకు సంపాదించడము.