పుట:2015.396258.Vyasavali.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
98

వ్యాసావళి

చ॥ పలుకుల పొందులేక రసభంగము సేయుచు బ్రాత వడ్డ మా
      టల దమనేర్పుజూపి యొక్కటన్ హృదయం బలరింఫ లేకయే
      పొలమును గాని యట్టి క్రమముం దమ మెచ్చుగ లోకమెల్ల న
      వ్వుల బొరయం జరించు కుకవుల్ ధర దుర్విటు లట్ల చూడగన్
      

     పాతమాటలలోనే మహత్మ్యమున్న దనుకొన్న వారు. అనన్యసామాన్య భాషావైదుష్య గరిష్టులు, 'ఆంధ్ర భాషామయం కావ్య మయోమయ విభూషణం గీర్వాణా రణ్య సంచార విద్వన్మత్తేభ శృంఖల ' మ్మని చెప్పదగిన కావ్యములు రచించుకొని, తమమాటలు పండితుల కయినా తెలియకుండా చదువుకొని కావ్యరసము జుఱ్ఱు కొందురు గాక! రసజ్ఞలయిన కవులు మాత్రము అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కూడా యధోచితముగా సరికొత్తమాటలతో పొందించి వివిధములయిన్ కావ్యములు వ్రాస్తూనే ఉన్నారు. రామభద్రుడు సకలకధాసారసంగ్రహమందు;

ఉ॥ నన్నయ తిక్కనాది కవినాధులు చెప్పిన యట్ల
చెప్పలే
      దన్నా దదుత్త రాంధ్రకవులూరక యుండిరె? తోచినట్లు ని
      త్యోన్నత బుద్ధి గబ్బములు యోజ రచింపక యందు జ్ఞాన సం
     పన్నుల కావ్యములో హరి సమర్పణమై చెఱనొందు నెందునున్॥

   అని ఉత్తరాంధ్రకవుల కావ్యములకు గౌరచము లేదన్న వారికి ప్రత్యుత్తరముగా చెప్పినాడు. ఈతని తాత వాడుకమాటలతో చెప్పిన ఒంటిమెట్ట రఘువీర శతకమును ఆకాలమువారు మెచ్చుకొన్నారట! భాషలో అపశబ్దము లున్నా, సువ్యక్తమై భావము మంచిదైతే చాలును. 'చెరకునకు వంకబోతేమె చెడునె తీపు ' అని కేమప్ప అన్నట్లె

మ॥ అపశబ్దంబులగూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపా
       ప పరిత్యాగము సేయుగావున హరిన్ భావించు చున్, బాదుచున్,
       జపముల్ సేయుచు, వీనులన్ వినుచు నశ్రాంతంబు గీర్తించుచున్,
       దపసుల్, సాదులు ధన్యులౌదురు గదా తత్వజ్ఙ చింతింపుమా.

అని భాగవతోత్తముడైన బమ్మెర పోతరాజు చెప్పిఉన్నాడు.