పుట:2015.392383.Kavi-Kokila.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధవ విజయము


మనో : మాధవా, నీకు మరణింప నిచ్చకలదా?

                    అదిగో! యాగిరి శృంగమెక్కుదము సంధ్యారక్తవర్ణాంకితాం
                    బుద రమ్యాంబర భిత్తిపై మన వపుర్మూర్తుల్ మషీచిత్ర సం
                    పదరూపింప, నభుక్తమౌ వలపుతాపంబుల్ శమింపంగఁ, బే
                    రెద కౌఁగిళ్ళ సుఖించి క్రిందినదిలోనే దూకి నిద్రింతమా?

శ్యామ : అన్నయ్యగా రిక్కడికే వస్తున్నారు!

మనో : ఏఁడి! విజయవర్మగారు గూడ వచ్చుచున్నారు. నే నిఁక బోయెదను. అన్న కోపగించు కొన్నను సహింపుము.

[విజయవర్మ రాజశేఖరులు ప్రవేశింతురు]

రాజశేఖరుఁడు : [స్వగతము] వీ రిచట మాటలాడుచుండి, మమ్ము చూచి మనోరమ చెట్లచాటునకు పోయినది. [ప్రకాశముగ] ఓరి, నీకింకను జ్ఞానములేదా? నీ యంతరమును నీ వెఱుంగవా? మాయమాటలతో ఆ యమాయికను లోఁబఱచుకొన యత్నించుచున్నావా? ఓరి దుర్జాతీ, నిన్నిప్పుడే యీవనదేవతలకు బలియిచ్చెదను.

[కత్తిదూసి మాధవునిపైకిపోవును. అంతలో మనోరమ రాజశేఖర మాధవుల మధ్యకువచ్చి రాజశేఖరుని పట్టుకొని,]

మనోరమ : అన్నా, తొందరపడకుము, మాధవుఁడేల యింతటి పగవాఁడాయెను?

మాధ : [గంభీర నిర్లక్ష్యభావముతో] రాజశేఖరా, యా యాట వస్తువును దాఁచియుంచికొనుము.

రాజ : [కోపముతో] ఏమీ, ఈకరవాలము నీహృదయ రక్తమును ద్రావునపుడు విషవ్యాళమని తెలిసికొందువు.