48
శంబుక వధ.
మిమ్ముఁ చాలించి మయూరబ్ద కార్యమును నెగ్గించును గాక,
మగిడి కిష్కింధాపురమునకుఁ బోవుతలంపున శ్రీరామచుద్రుని
కడ సెలవంది. కొన్ని సంగతులు మీకు జెస్పి పోవువాఁడనై
యిచ్చటకు వచ్చితిని.
శం:- కుమారా! చెప్ప వైతివా సంగతులను, విన ముచ్చటపడు
చుంటిని.
అం: _ మహాత్మా! నోరాడకున్నయది. చెడుమాటలు చెప్పవలసిన
వాఁడనైతి.
శం:- ఏమినీ వెర్రి ! తెగించిన వానికి సముద్రము మోకాలిబంటి కాదా!
ప్రాణమున కాశింపని నాకుఁ జెడుమాట లుండునా?
అం:- ఋషి.చంద్రమా! వసిష్ఠుల వారి కుట్రచే నోషధీ సాహాయ్య
మున నొక బ్రాహ్మణ బాలుని విసజ్ఞుఁ ని జేసి కొలువునకుఁగొంపోయి
మీ మాశ్రమవ్య త్యాసముచేఁ గల్గిన ఫలమని ఆ రామచుద్రునకు
నచ్చజెప్పిరి. నచ్చజెప్పి మిమ్ము శిక్షా పాత్రుని జేయుటకు యత్నిం
చుచుండ నేను జూడఁజాలక మీకడకరుదెంచితిని.
శం:-- (అలక్ష్యభావమును సూచించు నగవుతో, ఱోటిలోఁదలఁ
దూర్చి రోకంటిపోటునకు వెఱవనగునా? ఈ కార్యవిధాన
మంతయు నూహింపనది కాదు. కానఁ బిరుతినియవలసిన పనిలేదు.
పాపము! పసిష్ఠులవారి కెట్టి యవస్థవచ్చినది ?
అం:- దేనా ! ప్రొద్దెక్కు చున్నది. అనుజ్ఞయిత్తురా! (నమస్కరిం
చును.)
శం; — (లేవదీసి) కుమారా! కృతర్థుడవుకమ్ము, సుఖమున బోయి
రమ్ము,