తృతీ యాంక ము.
49
అం:- (కన్నుల నీరునించికొని డగ్గుత్తికతో) ఎన్నఁటికో పునః ర్దర్శనము?
సంయమీంద్రా ! యీశిష్యుని సేవ సంగీకరింప నిచ్చగల దేని
గాంధారి మాంధార ప్రొద్దు వేళ గబురంపినను మీపదసన్నిధి
వ్రాలును.
శం:-- పరోపకారబుద్ధి మహనీయుల లక్షణముకదా ! పునర్దర్శన మైనను
గాకున్నను బరస్పర సంభాషణము మాత్రము మఱచి పోకుము.
అం:- దేవా! మియాశీ ర్వాదమే నాకు జీవగర్ర పనివిని యెదను.
శం:- (తటానలు లేచి యంగదుని గౌగలించుకొని గద్గదస్వరముతో)
కుమారా ! పోయిరమ్ము, సుఖమున బోయి రమ్ము (అంగ
దుఁడు నిష్క్రమించును శంబుకుఁడు చింతామగ్నుడై కూరుచుం
డ శిష్యుడొక యుత్తరముతో బ్రవేశించి) దేశి కేంద్రా! యిదిగో!
శ్రీరామచంద్రుఁడు మీకయి యంపిన యుత్తరము. (అందియిచ్చును)
ఏమి సెలవిత్తురో ! వాకిట సేవకుఁడు వేచియున్నాడు.
శం:- (ఉత్తరమును దీసికొని వీప్పుచు) బ్రహ్మదాసా !మనమను
కొన్నది యనుకొన్నట్లు జరుగుచున్నది. ఈయుత్తరమును నీవు
చదువుము. వినియెదను. అక్షరములు బాగుగాఁగన్పట్టుట లేదు .
(ఉత్తరము శిష్యునకిచ్చును; శిష్యు డంది పుచ్చుకొని చదువును.)
శ్రీసాకేత పుర సింహాసనస్థిత పట్టభద్రుండును, సూర్యవంశ
సముద్భూతుండును, హిందూమత సంరక్షకుండును, వర్ణాశ్రమా
చార పరిపాలన బద్ధకంకణుఁడు నునగు దాశరథ శ్రీరామసార్వభౌ
ముండు శంబుకునకుఁ దెలియఁజేయునది;
నీవు వైదికధర్మ విరుద్ధకర్మతుండవై , స్మృతి విహితమయిన
ద్విజ సేవ ద్యజించి, ద్వైజ కర్మంబులనుష్కింపు చుండుటయే కాక