36
శంబుకవధ
మాసు షేణు తాతగారిని దీసికొనివచ్చిన యెడల
"నేదియో విఱు గుడిచ్చి లబ్ధః ప్రజ్ఞునిఁ జేయకుండునా ! కట్టా యిప్పుడు
నేనేమి చేయఁగలను. ఎంత మోసము. అయినను శ్రీరామచంద్రుఁ డేమి
చెప్పునో వినియెద.
శ్రీ:- మహాత్మా ! యిట్టి బాలారిష్టము దేని వలనఁ గల్గునో సెలవిండు
వ: (దీర్ఘముగా విచారించి)
శ్లో:యరాష్ట్రే నృపాలస్య ! తురీయశ్చతపోధనః
తత్రతధ్యమ్' భవ త్యేన 1 విప్రబాలస్యమారణమ్: 1
శ్రీ కామచంద్రా ! .ఇఓకను సంశయమేల ! ఏరాజు రాష్ట్రము
నందు శూద్రుఁడు తపస్సుఁ జేయు చున్నాడో యచ్చట నేయకాల
ముగా విప్రబాలురకు మరణము సంభంచి తీరునని స్మృతి
వాక్యము చెప్పుచున్నది. ఇంతకన్నను మన కేమి తార్కాణము
గావలయును?
హ:- (వినయముతో) దేవా ! మీవాక్యములు మాకుఁ బరమప్రమా
ణములు. సందేహింపవలసిన యగత్యము లేదు కాని యొక్క
సంగతిని దెలియఁ గోరుచున్నాఁడను.
అం:-(తనలో) కట్టకడకు మాహనుమయ్యకుఁగూడ నేదియో సంది
యము పొడకట్టినది. తఱుమగాఁ దఱుమగాఁ బ్రాణరక్షణకయి
గొర్రెయయినను వెనుదిరిగి పొడుచునన్న సామెత యబద్దమగునా?
చై: (కోపముతో) ఆంజనేయా! వసిష్ఠులవారేల? నేనే సమాధానముఁ
జెప్పెదను. ఆసందియ మేదియో తెల్పుము.
హ:- ఎవరయిన నా కేమి స్వామి", "అవస్యమనుభోక్తవ్యమ్ కృతమ్
కర్మశుభాశుభమ్” అను వాక్యముల చొప్పున సూద్రు డెవండేని