ద్వితీయాం క ము,
37
యాత్మకు ధర్మముల విసర్జించి, ద్విజ హితములగు కర్మముల
నాచరించిన యెడల దచ్ఛూద్రుడు పాపగ్ని దగ్ధడు కావలయును
గాని ద్విజ శిశువు మరణించు టెట్లు తటస్థిఁచును ? ఇటులయినచో
ద్విజేతరులు తపంబుఁ జేసిన యెడల ద్విజులు నామమాత్రావ శేషు
లగుదురా ! అధర్మమా చరించుచున్న పశ్యతోహరుని మహా పాప
ముచే నెచ్చటనో యున్న పరులు నశింతురా ? పాతకులను దమ
పాపములు బాధింపవా! అట్లుండ నైన నాకేమియ దోచుటలేదు.
అం:-(తనలో) మాహనుమన్న యెంతవాఁడైనాఁడు? వేదాంతము
వెలిగించు చున్న నాఁడు. దొంగకు నీతులా?
చై: ఆంజనేయా ! శ్రమపడి ప్రశ్న నడి గితివి కాని నీకు శాస్త్ర చర్చ
చేయు నధికారము లేదెఱుంగ దువా! మాబోంట్లు ధర్మ సూక్ష్మమ
ములను నీకు, జెప్పను దగదు, నీవు వినను దగదు.
అం:-(తనలో) మాహనుమయ్య తలతిక్క వదలి నట్లున్నది.
హ:-అయ్యా ! మాకెందులకుఁ జెప్పఁగూడదో యిప్పుడు తెలి
సినది.
వ:- (రామును ద్దేశించి) వింటివా రాఘవ రామచద్రా యాశ్రమసాం
కర్యంబునఁ గల్గు దుర్నయములు ! మనము విన్న దానికిని నేడు
కన్న దానికిని సరిపోయినది. ఇది తప్పక శంబుకుని తపశ్చరణ
ఫలితముగా నోపు. నిర్నిమిత్తంబుగ నిట్టివి గలుగవు.
అం:-(తనలో) ఇంక నేనిచ్చట నిలువఁజాలను. మానవుఁడెట్టి కార్య
ములను జేయఁగలడో నేడు తెలిసినది. (నిష్క్రమించును.)
శ్రీ:- మునీంద్రా ! నామనంబింకను సంతృప్తి పడకున్నది. నిర్జనమైన
యరణ్యసీమ తపంబు జేసికొనుచున్న శంబుకునకును నీబాలమర