ద్వితీయా o క ము.
35
వ్వారలు విప్రభక్తి పరి వర్జితు లెన్నడుగారు గావునన్
బాఱుని బిడ్డ కిచ్చెదవొ ప్రాణము! శాపము నే గ్రహింతువో!! 4
అం:-(తనలో) ఏమీ బెదరింపు; తన బిడ్డను బ్రదికించుకొన లేని
యీపొఱుడు శాపము నిచ్చునట, ఏమనియో !
వ:- అకాల బాలమరణ దఁడహ్యమానుడవైన యోయదృష్టహీనుడా
చక్రవర్తిని దూలనాడకుము.
బ్రా: వసిష్ఠులవారా ! దుఃఖమున మునిగిన నేను మిమ్ముఁజూడఁ
జాలక యపచారమును జేసితిని. నసుస్కారము. శాస్త్ర విహిత
ముగా రాజ్య మేల జాలని చక్రవర్తిని దూలనాడ కేమి చేయఁ
గల్గుదును?
శ్రీ:- ఓభూ దేవా ! బ్రాహ్మణ ధర్మముగాని యీయీ కోపమేల పూనెదవు.
వాటిల్లన యావత్తు సవిస్తరముగా దెల్చిన నదితీర్ప శ్రీరాముడు
సంసిద్ధముగా నున్నాడు.
బ్రా:ఇతను నాబిడ్డడు, లేక లేక కన్న సంతానము:- నేడకస్మాత్తుగా
మరణించెను. కారణము మీరే యరయుఁడు.
అం:-(స్మృతి నభినయించి యక్కజ పాటుతో) ఔరా ! యౌరా !
యేమి యీకుట్ర ! ఏమి యీతంత్రము ! ఏమి యీ ఛద్మ కాశ
లము! ఇప్పుడంతయు నర్థమయినది; వసిష్ఠుల వారెంత తంత్ర
జులు మొన్న సాయం కాలము, వసిష్ఠులవారశ్వనీ దేవతలతో
గుసగుసలు వోవుటకు, గారణమిదియా ! భూ దేవులాకాశ దేవు
లొక్క టైరి. ఇక శంబుకర్షికి బ్రాణములు దక్కుటెట్లు ! అశ్వనీ
దేవతల సాహాయ్యమన నీకుర్ర వానిని మూర్ఛపోగొట్టి శంబుకర్షి
తపఘుచే మరణించెనని చెప్పవచ్చిరి. ఎంత పొఱపాటు: జేసితిని,