30
శంబు క వ ధ.
వాని మొగము జూచినప్పుడే నాకనుమానము గల్గినది.
అం:-(తనలో) తాతగారూ! నాకు మంచిబిరుదే యిచ్చితిరి. అదియే
నిజము కానలయు..
శ్రీ:- చిత్తము! మీజ్ఞాబద్ధులము
వ: అటులయినచో రామభద్రా! యిటువినుము, నీవు రాష్ట్రసమా
చారము లెఱుంగ కుండినను, మేము మాత్రమెఱుఁగకుండఁ జాలము.
సాకేతపుర రాజ్యశ్రేయస్కాము లమయిన మేము దానిపట్ల బ్రాణ
ములయిన విడుతుము. నేడయోధ్యా పట్టణ మంతయు గుసగుసల
తోడను జిటచిటల తోడను నిండి యున్నది.
అం:-(తనలో) ఏమి చెపుమా ! వసిష్ఠు తాత గారి యవ్యాజ పరోప
కారశీలత వెల్లివిరియు చున్నది.
శ్రీ:- కారణ మేమి ?
వ:-- కారణమా ! ఎన్నడయిన వినియుంటినా శంబుకుని పేరు ?
శ్రీ:- మాకర్ల తాడిత మైనట్లు కన్పట్టదు.
వ: నేఁటిదనుక మేమును వినియుండ లేదు.
వై:-అట్టి యల్పుడే యీ గుసగుసలకన్నిటికిని మూలకారణము .
ప:-ఇతఁడ నార్యుఁడు, అనగా ద్విజేతరుఁడు, అనగా ద్రావిడుఁడు,
అనఁగా మనస్మృతులు పేర్కొన్న శూద్రుఁడు.
చై:- (సంతోషమునుబట్ట జాలక తనలో) ఆహా! పూర్వసముపార్టీత
మైన విద్యనంతయు నుపయోగపఱచుచున్న వారు వసిష్టులవారు.
సమయమున కక్కఱకు రానిచదువు చదువా?
అం:(తనలో) వసిష్ఠుల వారందఱిని గలగూరగంప చేసినారే,
...