ద్వితీయాంకము,
29
తెలిసికొనుటచేఁగల్గిన యగచాట్ల కుందుచే మరల వట్టిపనికి
బూనుకొనఁడని నాతలంపు,
శ్రీ:- దేశి కేంద్రా ! యకస్మాత్తుగా సంభవించిన భార్యావియోగ
దుఃఖముచే మతిచెడి రాజు కార్యములయందు బ్రమత్తుడనై
యున్నాఁడను.
వ:- సూర్యవంశమునం దుద్భవించిన నీవలన నెట్టి మాటలు ఏంటి. నీవు
ధీరోదాత్తుడవు; ఇట్లు కుందఁదగునా ! యిట్లాడఁ దగునా ? ఎన్ని
సంకటములు సంభవించినను రాజ ధర్మమును నేఱు వేర్చుటవిధి కాదా?
శ్రీ:-సూర్యవంశపు పరువు మర్యాదలను నిల్పుటకే యి యగచాట్లను
ధైర్యముతో ననుభవించు చుంటిమి.
వ:-నీవీశ్వరాంశ సంభూతుఁడవు, కానఁ బ్రాకృత జనంబులట్ల మాటాడఁ
జనదు.ఈ విషయమున వాల్మీక మహాముని యభిప్రాయమును
వినియుండ లేదా ? ఈశ్వరావతారమని చెప్పుచున్నాడు.
అం:(తనలో) ఇటు వాల్మీక రామాయణమును విన్నాడు; అటుహను
ద్రామాయణమును విన్నాడు. కాని శ్రీ రామచంద్రుడు తానిం
కను మనుష్య మాత్రుడో, యీశ్వరుఁడో నిశ్చయించు కొననట్లు
న్నది. ఒక వేళ రెండునుగాక త్రిశంకు తాత గారి స్వర్గవాసి
యేమో?
శ్రీ:- దేవా ! క్షమియింపుఁడు. 'మనుష్య రూపము: తోనున్న మేము
మనుష్యులట్ల చరియింప వలదా ?
ప: శ్రీరామచంద్రా ! నీవు సార్వభౌముఁడవగుటం జేసి రాజధర్మము
ను విధ్యుక్తముగా వెఱవేర్పవలసి యున్నది
వై :-(తనలో) ఆకోతి ముండ కొడుకేదియో మందు పోసినట్లున్నది.