ద్వి తీ యాంక ము.
25
శ్రీ: ఓయీ! హనుమం తా ! నీవుసూర్యవంశపు పరువుమర్యాద
లెఱుఁగనట్లు మాటాడు చున్నావు.
హ:-- ఎఱుంగ కేమి మహత్మా! ప్రాకృతజనంబులాడు మాటలు
పాటించి వంశము కలంకము పాలగునని తలంచి, నిరపరాధినియు
సాధ్వీమతల్లియునగు మాయమ్మను హేయమగు నిందపాలు సేయు
టుచితమో! నేనె ఱుంగనా ! నాఁడశోకవనమధ్యంబున మలిన
జీర్ణాంబరములతోడను, సంస్కారశూన్యములగుటచే జడలుగట్టిన
శిరోజములతోడను, దీనా రాత్రములు హా రామ, హా రామ;
యనుచు మిమ్ముల ధ్యానించుట, అట్టి తల్లికా యిట్టివాదు ?
త్రేతాయుగలక్షణము కాఁబోలు.
అం:- దేవా ! మేము చెప్పునంతటి వారము కాము గాని సీతామహా
దేవి వనవాసము చేత సూర్య వంశమున కపకీర్తి గాని కీర్తి రానేరదని
నాతలంపు.
శ్రీ:- (నిమీలిత నేత్రుడై విచారించి) అంగదా! నీ వాక్యములయందు
సత్యము లేక పోలేదు. కాని! «జన వాక్యమ్ తు కర్తవ్యమ్" అను
పల్కులఁ బాటింప వలసిన వాఁడనైతిని.
హ:- దేవా! యీనానుడి మాబోటి ప్రాకృత జనంబులకుఁ గాని
వంటివారికి గాదు.
శ్రీ: ఆంజ నేయా! నీవు కూడ నానింద మానెత్తి పైనే పడ వేయుచున్న
వాడవా?
(ద్వారపాలకుడు ప్రవేశించి, మహాప్రభూ ! వసిష్ఠులవారు
తమ సందర్శనార్ధమై వచ్చినారు. ఏమి సెలవు ?
శ్రీ:- ఇంతకన్నను గావలసినది యేమున్నది? వెంటనే తోడ్కొని
రమ్ము,