26
శంబుకవధ
వసిష్డు, చైనులు ప్రవేశింతురు. శ్రీరామచంద్రుడు పీఠము
డిగ్గి సూర్యవంశోద్భవుడును, శిష్యుడునగు రామభద్రుఁడు
నమస్క రించుచున్న వాడు.
వ,చై- వర్ణాశ్రమాచారపర్కమణసామర్ద్యమస్తు .
హ: రామభద్రుని సేవకుఁడు
హనుమంతుడు నమస్కరించుచున్నాడు.
వ,చై:--పుత్రపౌత్రాభివృద్ధిరస్తు.
అం:-(తనలో) మా హనుమచ్యు యెంత యదృష్టవంతుడు: పెం
డ్లియుఁ బెండ్లముకు లేకుండఁగ నే బిడ్డలమీఁద బిడ్డలను బొంద.
బోవుచున్నాఁడు. ఇందులకు సంశయమేల ! | బ్రాహ్మణులమాట
రిత్తవోవునా ! (ప్రకాశముగా) కిష్కింధాపుర యువ రాజంగ
దుఁడు నమస్కరించుచున్నా డు.
వ, వై:-( తేఱి పాజు జూచి యాశీర్వదింతురు.)
శ్రీ:- ఇదిగో ! యిందుదయచేయుఁడు. (అందఱుపనిష్టులగుదురు)
వ:- రామభద్రా ! మనోవ్యాకులము లేకుండ రాజ్యము బరిపాలించు
చుంటివికదా ! క్రొత్తవింత లేమియు లేవుకదా !
శ్రీ:- మీ యాశీర్వాదబలమువలన ధర్మానుష్టానపరుడనై ప్రజలు
సంతుష్టి బొందునట్లు రాజ్యము చేయుచునే యుంటిని.జగ
ద్గురువులయిన మీరు మాయెడఁ బరిపూర్ణకటాక్షముగల్గియుండ
బాలనయందుఁ గొఱు తేమియుండును ?
2:- దేవా ! సూర్యవంశము సాకేతపుర సింహాసనమునందున్నంత
కాలము మాబోటి వైదికులకు గోదవలేమియుండవు.
(అని యాగును)