ఈ పుట అచ్చుదిద్దబడ్డది
24
శం బు క వ ధ.
<poem>>
శ్రీ:- ఆంజనేయా! వెర్రి యేడ్పు లేడ్చుచున్నావు. మేము విధించిన
దండనచే మేము దోషముఁ జేసితిమనియా నీయుద్దేశ్యము
హ: నే ననఁజాలనుగాని, మాయమ్మ మాత్ర మాడండనకు ను
రాలు కాదని యెఱుంగుదును.
శ్రీ: అయిన మేము దోషముఁ జేసినట్టేక దా! దీని నిదివఱ కేల
చెప్పకపోతివి.
హ:-- చెప్పనందులకు నామన స్సాక్షి నన్ను బీడించుచు నేయున్నది.
ఇన్ని దినములనుండి నేను గంటఁగగూర్కెఱుందునా ! 'మొన్న యూజగన్మాత స్వప్నమునఁదోఁచి కనుకొలుకుల నుండి వేడికన్నీరు కాల్వలై పాఱుచుండఁ గొనగోట జిమ్ముచు డగ్గుత్తికతో “గుమా రా ! యక లంకమయిన నాచారిత్రమును, దుర్మార్గులకు దుర్జ్వేయ మైన నాపాతివ్రత్యమును, నీ వెఱుంగ వా ? ” యనెను నేనులికిపడి తల్లీ ! యెఱుంగ కేమి ? ఈదీనుఁడు మీసన్నిధానమున నిల్చుటక యిననర్హుడాయంటిని. అట్లయిన చో శ్రీరామచంద్రునితో జెప్పి యేల వారి సంశయములను దీర్పవనియెను, తల్లీ! తల్లీ!! జగ న్మాతా !!! నేన సమర్థ డను, నేనసమర్ధుఁడను. అమ్మా ! నేనెవఁ డను ! ఆమహాను భావునకు నొక సామాన్య సేవకుఁడను, నామాట యందు వారికి గౌరవ మెట్లుదయించు నంటిని ! కుమారా ! నీవు చెప్పునదియు నిజమే. రారాని పోరాని యడవులలో బడవలసిన యిడుములకు బీతువడను. 'అన్యాయంబుగ నామెడకు దగిలించిన యీ “నిరాపనింద” నెట్లు పాపు కొందునా యని దురపిల్లుచుంటిని, ఇక నెవరు నాదిక్కు ! మరల మిమ్ముఁ జూడఁ గల్గుదునో లేదోయని యంతర్థాన మయ్యెను. నాటనుండి నాకు నిద్రాహారములు రుచిం</poem చుట లేదు.