8
శంబుక వధ,
రుణుఁ యమ్మహాజననిఁ జితి నెక్కించి, హవ్యవాహనుని మూలఁ
బున, నమ్మహా పతివ్రత సాధుశీలమును, నకలంక చారిత్రమును
నవ్యాజ పతిభక్తియుఁ దానెఱుంగుటయే కాక లోక మెల్ల నెఱింగి
నను, నిప్పుడిట్టి యకార్యమునుజేయు టేల. కేవలము ప్రజలను
సంతోష పెట్టుట కేనా ! కుమారా ! యొక్క సంగతి యున్నది.
గీ; పెక్కు జనముల సంతోష పెట్టఁదలఁచు
వాడొకనినైన సంతోష పఱుప లేక
తుదకు వ్యర్థ ప్రయత్ను 2 , • దుఃఖభాజు
నుఁడగు నిరతంబు పెక్కులు , నుడువ నేల?
శ్రీరామచంద్రుఁ డీయవస్థనే పొందినాడని నాయాశయము.
శి - శిష్యుని ప్రవేశము ) ఇవిగో! పూజాద్రవ్యములు.
శం-ఇటులుంచుము.
శి:- దేవా! యప్పుడే వాల్మీకులవారు రామాయణము వ్రాసికఁట
శ్రీరామచంద్రుని భగవదవ తారముగాఁకడఁ జేసినారట.
అం:గురుదాసా! కాడనియా నీనమ్మకము?
శి:- కాకేమిగాని, కవీంద్రుని లేఖనిలో నున్న మాహాత్మ్యము మాత్ర
ము నన్నబ్బురపడఁజేయు చున్నది. కవి లేఖనికి విశ్వామిత్ర సృష్టిఁ
జేయు శక్తిగలదు.
అం: గురుదాసా ! యేమి నీ యుపాలంభనములు ?
శి:- యువరాజా ! నన్ను బరిహసింపకుము. మన హనుమంతుడు
కూడ నొక రామాయణము వ్రాసి శ్రీరామచంద్రున కర్పించె
నట. ఎందు చేతనో కాని దానిని సముద్రమునఁ బాఱ వేయించెనట.