పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము.

77


తే.

ఖాన్ఖుహా మిమ్ము రమ్మని కాగితంబు
వ్రాసినాఁ డని చూపి శీఘ్రంబుగాఁగ
వర్తమానంబుఁ దెమ్మన వారు నట్ల
నరిగి గిరికాననమ్ముల తెఱఁగు లరసి .

142


మ.

హరకాలా లిటు వచ్చినారు భవదీయాలోకనేచ్ఛారతిం
దురకాతం కనిపించినాఁ డనిన సంతోషించి రంగక్షమా
వరచంద్రుండును గొల్వుగూటమునకు న్వారిం గడు న్వేగ రా
నరు నంపించిన వారు వచ్చిరి మహానందంబు సంధిల్లఁగన్.

143


క.

హరకాలా ల్గొనివచ్చిన
ఫరావానా చూచి హర్షపరవశుఁ డగుచున్
శిరసావహించికొనుచుం
దిరమగు బహుమానజలధిఁ దేల్చె న్వారిన్.


మ.

తగు ప్రత్యుత్తరము ల్మహావినయసంధాబంధురస్ఫూర్తిమై
నగధీరుం డగురంగరాయనృపుఁడు న్వ్రాయించి పంపించె నిం
పుగ నా వచ్చినవారిసంగతముగా భూరిప్రతాపైకర
మ్యగుణాలంకృతు దామెరాన్వయుని దమ్మన్నప్రభుగ్రామణిన్.

145


మ.

అతఁడుం దగ్గబలంబుతో నరిగి ధూమ్రాక్షప్రతీకోద్ధతా
కృతీయౌ హైదరుజంగు నుగ్రతమదృగ్వేల్లద్రుషాపావకో
ద్ధతకీలాముఖవిస్ఫులింగుఁ గని యాత్మ న్నివ్వెఱం గందుచున్
హితముం దెల్పుచు నర్జుదాస్తు గుజరాయించె న్సమంచద్గతిన్.

146


తే.

అట్టు లరుదెంచి పొడఁగనునంతలోన
నెరపరము కన్నుదోయికి నెగరఁబాఱి
యెఱ్ఱడా ల్సూప ఖానుసాహేబుగారు