పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

రంగారాయచరిత్రము


ఖానుఁ డూహించెఁ దమ్ములఁ గణుతిగొనక
బందరుకుఁ బంపి యచ్చోట బట్టు సేసి
యుత్తరము దెచ్చినా రన్నయుత్తలంపు.

136


తే.

క్షత్రవర్యుండు హైదరుజంగుఁ గలిసి
చూచితిరె మి మ్మొకింతైన సూటిగొనక
రావుకులసంభవుం డైన రంగనృపతి
కార్య మితరప్రపంచంబుగా నొనర్చె.

137


మ.

మును నే నెంతయు విన్నవించు పొరపు న్ముచ్చట్లకు న్వారుచే
సినతంత్రంబునకు న్సమాన మయి మీచిత్తానకుం దోఁచియుం
డెనొ లేదో తమచేరుదుస్తునకు రా డీరావువంశోదయుం
డనుమాట ల్నిజమేకదా యనుచు రోషావేశ మెక్కించుచున్.

138


క.

ఎక్కడిబందరుపట్టణ
మెక్కడిబొబ్బిలిగడీ మరెటగోరుందో
రిక్కార్యము వడి మించం
ద్రొక్కుటె మే లనుచు రాచదొర పల్కుటయున్.

139


తే.

ఖానుఁ డట మున్ను జ్వలితకృశానులీల
నుండుటకు దోడు నా రాజునుడువు లంత
వన్నియ వహించె మిగులఁ బ్రవర్గ్యఁజల్లు
బాలచందంబుఁ దెలుపుచు భగ్గురనఁగ.

140


మ.

కలితక్రోధరసాంతరంగుఁ డగుచున్ ఖానుండు దర్పించి చా
రులఁ బంచె న్బహుగూఢపూర్వగతుల న్రూఢంబుగా నేగిబొ
బ్బిలిఖిల్లానలుదిక్కు లారసి తదాభీల స్థితిస్ఫూర్తిజం
గలుఝాడీమయిధానులం దెలిసి రంగారాయనిం గాంచుచున్.

141