పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము.

75


తే.

 అచట నొకరెండుదివసంబు లధివసించి
కదలి చేరెను లష్కరు కసిమికోట
యందు గలసిరి వచ్చి కుమందరనుపు
మర్తెనాహ్వయుఁడును రాయమంత్రిమణియు.

131


ఉ.

 వచ్చినవానిఁ గాంచి చెలువంబున బూసియు నెమ్మనంబునన్
హెచ్చిన కౌతుకంబున నహీనయశుండగుమందరుండు పెం
పచ్చు పడంగఁ బంపిన మహామహు మర్తెను గారవించుచున్
ముచ్చట సల్పి యంతటఁ గుముందరు పల్కు హితోక్తి మెచ్చుచున్.

132


ఉ.

 హైదరుజంగునిం బిలిచి యాయనకుం దెలియంగఁ జెప్పి య
త్యాదరణీయుఁ డైన సుగుణాఢ్యుఁడు మాకు గురూపమానుఁడున్
సోదరసన్నిభుం డతనిసూక్తులు లెస్స గ్రహించు టుత్తమ
స్వాదుసుధారసైకపరిచర్యలు సుమ్మని సమ్మదంబునన్.

133


చ.

 అదియునుగాక రావుకులజాగ్రణితోడి నిఖా సమస్తమున్
మదుపరినిష్ఠితం బతని మన్నన సేయుట మంచిమాటరా
జుదితవిరోధబద్ధుఁ డయి యోర్వక చేయు కుయుక్తి నీరబు
ద్బుద మని వ్రాసి పంపె నిది బుద్ధిపరం బని యెంచి చూదుమా.

134


తే.

 ఇంక మన మిట్టు బొబ్బిలి కేగుపనికిఁ
గారణం బేమి గనుక సికాకులంబు
మార్గమునఁ బోదమనుచు సమ్మతిగఁ బలికె
నొడఁబడియె ఖానుఁడును బూసియుక్తి కపుడు

135


తే.

 అప్పటికి మంచి దని వచ్చి యాత్మలోన