పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము.

73


ర్మానితమూను నమ్ముసలిమానును రాజును బుద్ధిమంతులే.

119


మ.

మును రాచాతఁడు వెల్మబిడ్డఁడును మమ్ముం జూడఁగా వచ్చి వా
రును వారు న్వివరించుచోఁ దగదు మీరు న్మీరు చూపోపకుం
డని వైరంబునఁ బోరు పెట్టుకొని యి ట్లాడంగరాదంచు నా
కినుక ల్మానిపిపుచ్చినారము మృదూక్తి న్వారి నత్యంతమున్.

120


మ.

అభిమానంబె ధనంబుగాఁ గలుగువా రారావువార ల్మహా
విభవుం డీతఁ డటంచు నోడరు రణావిర్భూతమై పేర్చ ప్రా
ణభయావేశము లేశమైనఁ గనుగాన న్రాక రేచర్లగో
త్రభవు ల్చావనుజంప రాజున కయుక్తం బిట్టిచో వైరముల్.

121


తే.

రావువారిగడీమీఁద రాచవారి
పనుపునఁ బరాసువారు కోపంబు జేసి
నడచినా రనుదుష్కీర్తి పొడమకున్నె
మామకీనుల కిదియ ధర్మంపుఁ దెరవు.

122


తే.

నేర మొదవినచో నెట్టి క్రూరమైన
కర్మమున కొప్పు టిది జగత్ఖ్యాతిగాని
నిరపరాధులపై నిట్టిపరుసఁదనఁపుఁ
బని యసంభావ్య మని దూలఁ బలికికొనుచు.

123


శా.

భీమాటోపుని నాభిజాత్యపురుషున్ భీమప్రతీకాశు మూ
సామర్త్యేనుసమాఖ్యునిం బనిచె లష్కర్లోనికిం బోయి మ
త్సామర్థ్యం బెఱిఁగించి ఖానునకు మూసాబూసికిం దెల్పి ర
మ్మామాయామయుఁ డైన రాజుపలుకు ల్మన్నింపరాదం చొగిన్.

124


తే.

రాజుపిశునో క్తి చెవి నాని రావువారి