పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

రంగారాయచరిత్రము


మ.

కుతుకం బొప్పఁగఁ గాంచె నందుఁ గఫితు న్గోరుం దొరం బ్రస్ఫుర
ద్ధృతిసంరంభనిరస్తమేరుహిమవద్వింధ్యాద్రిరాణ్మందరున్
శతకోటిప్రసవాస్త్రమందరు రమాచంద్రాననాపాదప
ద్మతులాకోటిఝళంఝళారవయుతోదంచన్మణీమందిరున్.

114


తే.

ఇట్లు గనుఁగొన్న మన్నీనిహేజుబారి
కప్పరాసులయెకిమీఁడు చెప్పరాని
మెప్పురాఁ గప్పురపువీడ్య మప్పు డొసఁగి
కుశలసంప్రశ్న మొనరించి కుతుక మొదవ.

115


క.

ఆరాయభారి వచ్చిన
దూరాగమనంబుఁ జూచి దోడ్తో నడిగెన్
నీరాక కేమిగత మని
గోరుం దొరతనదుబాసికులమూలముగాన్.

116


క.

మద్దాల రెడ్డినాయఁడు
తద్దయు నారాచవారిధౌర్త్యము సర్వం
బుద్దవిడిఁ దెలుపఁ దెలియుచు
నద్దిఱ యని మిక్కుటంపుటక్కజ మందెన్.

117


ఉ.

బందరుపట్టణాధిపతి భాసురభోగపురందరుండు గో
రం దొరగారు విస్మయకరం బిటువంటిదురాగతంబు రా
జుం దురకాతఁడుం దలఁచుచు న్వెస రావుకులాగ్రగణ్యుపై
కిందిటమూఁది యేగ గమకించుట చోద్యము గాదె యారయన్.

118


ఉ.

మానితకీర్తిఁ గాంచు నభిమానధను ల్ధర రావువారు స
న్మాన మొనర్ప నర్హు లనమానపరాక్రము లట్టివారిపైఁ
బూనిక చేసి కార్యగతి పొంకము సేయుట లెస్సగాని దు