ఆంధ్ర కవిత్వచరిత్రము
ప్రథమ
60
యున్నారు. హపీస్ జేబ ఉన్నీసా మొదలగు కవి శ్రేష్టు లెల్లరును నీ సుఫ్వీసిద్దాంతమును కొంచెముగనో, గొప్పగనో గౌరవించి కావ్వరూపమునఁ బరిణమింపఁ జేసిరి. కాని రసజ్ఞులగుటచేఁ జప్పిడి నీతి వాక్యములట్ల రచింపక పైకి రసాత్మకముగను నీతివిదూర ములుగసు నుండి నీతియు, భక్తియు ధ్వనించు చుండునటుల గావ్యముల రచించి వివాదములబారి నుండి తప్పిం సుగొనిరి. వీరినిగూర్చి వేటొకచో సోదాహరణముగఁ జర్చిం చెదను.
కావ్యమున నీతధ్వనిమాత్రముగ నుండవలెను.
ఇంత పఱకుఁ దేలిన దేమనఁగాఁ గావ్యమున నీతి ప్రధా నాంశము గాదనియు, ధ్వని రూపమున మాత్రమే యుండఁదగు ననియు, నీతిబాహ్యముగ నుండఁదగదనియుసు. కావ్యమున నీతి ధ్వనించుచున్నంతవఱకుఁ గావ్యయము మానవ కల్యాణమునకుఁ దోడ్పడుచునే యుండును, కాని నీతిబాహ్య మైన తోడనే కావ్యము లోకమునకుఁ గీడు నాపొదింప జూలును. కాని యెయ్యది నీతి బాహ్య విషయమో యెయ్యది కాదో నిర్ల యిం చుటకుఁ గొంచెము సూక్ష్మబుద్ధి యుండవలయును.
కావ్యమునకు విశిష్ట నీతిధర్మము లే వర్తించును.
కావ్యసృష్టి కావ్య ప్రపంచమును గవి కపోలకల్పితములు గావునను, స్వతంత్ర ప్రతిభం గలవి యగుటను,సామాన్య ప్రకృతి కివ ర్తించు నీతినియమములు కావ్య ప్రకృతికి వర్తింపవు. కావ్య ప్రకృతి. కనుగుణములగు విశిష్టధరములును నతీత నీతినియమములును మాత్ర మే కావ్యమునెడ వర్తించుసు. ఉదాహరణములుగ రాధామాధవ, చిత్రాంగిసారంగధరుల ప్రణయ వ్యాపారములను సూచించితిమిగదా, కావున సూక్ష్మ పరిశీలన